Niti aayog proposes Construction Ban: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను ఊపిరి ఆడనివ్వకుండా చేస్తోంది. పెరుగుతున్న నిర్మాణ వ్యయం, ముడిసరుకు కొరత, విదేశీ మారక నిల్వలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నిర్మాణ పనులను  రెండేళ్ల పాటు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.

Continues below advertisement

 ఆగిపోనున్న మెగా ప్రాజెక్టులు! 

నీతి ఆయోగ్ సిఫార్సుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ సెక్రటేరియట్ పునర్నిర్మాణ పనులను కూడా ప్రస్తుతానికి వాయిదా వేయనున్నారు. నిర్మల్ భవన్, ఉద్యోగ్ భవన్ వంటి భవనాల కూల్చివేత, కొత్త నిర్మాణాలను వాయిదా జాబితాలో చేర్చారు. యుద్ధం కారణంగా స్టీల్, సిమెంట్ వంటి ముడిసరుకుల సరఫరాలో అంతరాయం కలగడం, దిగుమతి ఖర్చులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Continues below advertisement

 ప్రధాని మోదీ  పొదుపు పిలుపు.. ఆన్‌లైన్ క్లాసులే దిక్కా? 

ప్రస్తుత ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు కీలక విన్నపం చేశారు. విదేశీ వస్తువుల వాడకాన్ని తగ్గించి, స్వదేశీ వనరులపై ఆధారపడాలని  కోరారు. ముఖ్యంగా ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు పాఠశాలలకు ఆన్‌లైన్ తరగతులను  నిర్వహించాలని సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కోవిడ్ కంటే భయంకరమైన సంక్షోభం ఇదని ప్రధాని వ్యాఖ్యానించడం  తీవ్రతకు అద్దం పడుతోంది. 

అయితే అలాంటి ప్రతిపాదన ఏదీలేదని నీతి ఆయోగ్ వివరణ ఇచ్చింది. 

 మార్కెట్ల పతనం - 95కు చేరిన రూపాయి! 

నీతి ఆయోగ్ ప్రతిపాదనలు, యుద్ధ ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా  ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతుండటంతో భారత రూపాయి విలువ ఆల్ టైమ్ లో  95.28  వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది సామాన్యులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పెంచే ప్రమాదం ఉంది.

 ప్రతిపక్షాల విమర్శలు - సగటు పౌరుడిపై భారమా? 

మరోవైపు, ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నాయి. నిర్మాణ రంగం ఆగిపోతే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, ఆన్‌లైన్ క్లాసుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నాయి. అయితే, దేశ ఆర్థిక భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయాలు తప్పవని బీజేపీ వర్గాలు సమర్థించుకుంటున్నాయి.