Stock Market Closing Bell 26 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. అమెరికా ఫెడ్‌ సమీక్ష, వడ్డీరేట్ల పెంపు వంటి ఈవెంట్లు ఉండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 147 పాయింట్ల నష్టంతో 16,483 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద క్లోజయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 79.76గా ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,766 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,834 వద్ద లాభాల్లో మొదలైంది. 55,203 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,834 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 497 పాయింట్ల నష్టంతో 55,266 వద్ద ముగిసింది.


NSE Nifty


సోమవారం 16,631 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,632 వద్ద ఓపెనైంది. 16,463 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,636 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 147 పాయింట్ల నష్టంతో 16,483 వద్ద క్లోజైంది.



Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లోనే ముగిసింది. ఉదయం 36,688 వద్ద మొదలైంది. 36,334 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,695 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 317 పాయింట్ల నష్టంతో 36,408 వద్ద క్లోజైంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 38 నష్టాల్లో ముగిశాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. మీడియా తప్ప మిగతా రంగాల సూచీలన్నీ నేల చూపులు చూశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు తీవ్ర నష్టాల్ని చవిచూశాయి.