Stock Market @12 PM 17 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి. అమెరికా మాంద్యం వైపు పయనిస్తుండటం, ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచడం, గ్లోబల్‌ ఎకానమీ మందకొడిగా ఉండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,272, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 300 పాయింట్ల నష్టంతో 51,189 వద్ద కొనసాగుతున్నాయి. కొన్ని రంగాల సూచీలు 2 శాతం మేర పతనం అయ్యాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 51,495 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 51,181 వద్ద నష్టాల్లో మొదలైంది. 50,921 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 51,634 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 300 పాయింట్ల నష్టంతో 51,189 వద్ద కొనసాగుతోంది. ఒకానొక సమయంలో 500 పాయింట్ల మేర పడ్డప్పటికీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.


NSE Nifty


గురువారం 15,360 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,272 వద్ద ఓపెనైంది. 15,183 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,400 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 15,272 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 32,393 వద్ద మొదలైంది. 32,393 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 32,290 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 43 పాయింట్ల లాభంతో 32,660 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 13 కంపెనీలు లాభాల్లో 37 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, కోల్‌ ఇండియా, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్‌, విప్రో, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్‌, ప్రైవేటు బ్యాంకు సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఆటో, ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌  సూచీలు 1 శాతానికి పైగా నష్టపోయాయి.