Stock Market Closing 16 August 2023:


స్టాక్‌ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం నుంచి ఒడుదొడుకుల మధ్య సాగిన సూచీలు ఆఖరికి పుంజుకున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 30 పాయింట్లు పెరిగి 19,465 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 137 పాయింట్లు పెరిగి 65,539 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.27 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,401 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,238 వద్ద మొదలైంది. 65,032 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,605 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 137 పాయింట్ల లాభంతో 65,539 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


సోమవారం 19,434 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,369 వద్ద ఓపెనైంది. 19,317 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,482 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 30 పాయింట్లు పెరిగి 19,465 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,726 వద్ద మొదలైంది. 43,600 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,002 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 144 పాయింట్లు తగ్గి 43,946 వద్ద క్లోజైంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, ఇన్ఫీ, అల్ట్రాటెక్‌ సెమ్‌, ఎన్టీపీసీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ,  మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, మెటల్‌, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ ఎక్కువ నష్టపోయాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.200 పెరిగి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.23,870 వద్ద ఉంది.


Also Read: మీది 30-40 వయసా! 60 కల్లా రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.