Stock Market Closing, 11 October 2023:


భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం కళకళలాడాయి. వరుసగా రెండో సెషన్లో లాభపడ్డాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ ప్రభావం ఆ ప్రాంతానికే పరిమితమైంది. ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. రాబోయే నెలల్లో వినియోగ ధరల సూచీ తగ్గుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 121 పాయింట్లు పెరిగి 19,811 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 393 పాయింట్లు పెరిగి 66,473 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే 6 పైసలు బలపడి 83.19 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 66,079 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 66,376 వద్ద మొదలైంది. 66,299 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,592 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 393 పాయింట్లు పెరిగి 66,473 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 19,689 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,767 వద్ద ఓపెనైంది. 19,756 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,839 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 121 పాయింట్లు పెరిగి 19,811 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ ఎగిసింది. ఉదయం 44,554 వద్ద మొదలైంది. 44,411 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,710 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 156 పాయింట్లు ఎగిసి 44,516 వద్ద ముగిసింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 12 నష్టాల్లో ఉన్నాయి. హీరో మోటో (4.04%), గ్రాసిమ్‌ (3.31%), విప్రో (3.27%), అల్ట్రాటెక్‌ సెమ్‌ (2.10%), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (1.62%) షేర్లు లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌ (1.65%), కోల్‌ ఇండియా (0.64%), ఎల్‌టీఐ మైండ్‌ట్రీ (0.58%), ఎస్బీఐ (0.46%), టీసీఎస్‌ (0.44%) నష్టపోయాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకు సూచీలు స్వల్పంగా తగ్గాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు పెరిగాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో పెద్దగా మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.58,530 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.72,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.180 తగ్గి రూ.23,580 వద్ద ఉంది.


క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?


భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. సోమవారం నాటి నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఇజ్రాయెల్‌, పాలస్తీనా యుద్ధ భయాల నుంచి ఇన్వెస్టర్లు బయటపడ్డారు. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 177 పాయింట్లు పెరిగి 19,689 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 566 పాయింట్లు పెరిగి 66,079 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 83.27 వద్ద స్థిరపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.