Simple Arrive family electric scooter Arrive: భారత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన మార్కెట్లో తన మార్క్‌ను మరింత విస్తరించేందుకు సింపుల్‌ ఎనర్జీ సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పెర్ఫార్మెన్స్‌-ప్రాధాన్యత స్కూటర్లను అందించిన కంపెనీ, ఇప్పుడు కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన తొలి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 'అరైవ్‌' ‍‌(Arrive) పేరుతో రానున్న ఈ కొత్త స్కూటర్‌ను సెప్టెంబర్‌ 2న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా స్కూటర్‌కు సంబంధించిన కొత్త టీజర్‌ చిత్రాలను విడుదల చేయగా, వాటిలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపించాయి.

Continues below advertisement

కంపెనీ విడుదల చేసిన చిత్రాలు తక్కువ వెలుతురు పరిస్థితుల్లో తీసినవి కావడంతో స్కూటర్‌ పూర్తి డిజైన్‌ తెలియడం లేదు. అంతేకాకుండా వాహనానికి క్యామోఫ్లాజ్‌ కవర్‌ను కూడా ఉంచడంతో ముందు భాగంలోని కొన్ని అంశాలు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో పూర్తి డిజైన్‌ను అధికారిక ఆవిష్కరణ రోజునే చూపించాలని సింపుల్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీజర్‌ చిత్రాలను పరిశీలిస్తే ముందు భాగంలో వెడల్పయిన LED డే టైమ్‌ రన్నింగ్‌ లైట్‌ (DRL) కనిపిస్తోంది. ప్రధాన హెడ్‌ల్యాంప్‌లు ముందు ఏప్రాన్‌ దిగువ భాగంలో అమర్చినట్లు తెలుస్తోంది. అలాగే టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్క్స్‌, ఫ్రంట్‌ డిస్క్‌ బ్రేక్‌ను కూడా ఈ చిత్రాలు నిర్ధారిస్తున్నాయి. ఎత్తుగా ఉన్న హ్యాండిల్‌బార్‌ను బట్టి సౌకర్యవంతమైన రైడింగ్‌ పొజిషన్‌ను అందించేలా స్కూటర్‌ను రూపొందించినట్లు అర్థమవుతోంది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320

సింపుల్‌ ప్రస్తుతం విక్రయిస్తున్న సింపుల్‌ వన్‌ సిరీస్‌ స్కూటర్లను అధిక పెర్ఫార్మెన్స్‌ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. అయితే కొత్త అరైవ్‌ స్కూటర్‌ మాత్రం ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లేవాళ్లు, కుటుంబ అవసరాల కోసం స్కూటర్‌ను ఉపయోగించేవాళ్లు & నగర ప్రయాణాలను ఎక్కువగా చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. పెర్ఫార్మెన్స్‌ కంటే సౌకర్యం, వినియోగ సౌలభ్యం & ప్రాక్టికాలిటీకి ఇందులో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ కొత్త స్కూటర్‌కు 'అరైవ్‌' అనే పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇది టీవీఎస్‌ ఆర్బిటర్‌, అథర్‌ రిజ్టా & బజాజ్‌ చేతక్‌ వంటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. అలాగే అథర్‌ తన కమ్యూనిటీ డే కార్యక్రమంలో ఆగస్టు 29న పరిచయం చేయనున్న కొత్త EL ప్లాట్‌ఫామ్‌ ఆధారిత ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో కూడా నేరుగా పోటీపడే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో భారత ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

అయితే, 'అరైవ్‌' బ్యాటరీ సామర్థ్యం, మోటార్‌ వివరాలు, సింగిల్‌ ఛార్జ్‌తో వెళ్లే దూరం (రేంజ్‌), ఫీచర్ల జాబితా & ధర వంటి కీలక వివరాలను సింపుల్‌ ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ సమాచారం మొత్తం సెప్టెంబర్‌ 2న జరిగే అధికారిక ఆవిష్కరణ కార్యక్రమంలో వెల్లడించే అవకాశం ఉంది.

భారత మార్కెట్లో ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్‌ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సింపుల్‌ ఎనర్జీ కూడా ఈ విభాగంలోకి అడుగుపెడుతోంది. ఆకర్షణీయమైన డిజైన్‌, ఆధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన రైడింగ్‌ అనుభవంతో కొత్త అరైవ్‌ స్కూటర్‌ను తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.