Maruti Suzuki Announces Price Hike: ఇండియా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన మొత్తం మోడల్ శ్రేణిపై రూ. 30,000 వరకు ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రేట్లు జూన్ 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ఆటోమొబైల్ రంగాన్ని దెబ్బతీస్తున్న ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన పెంపు తర్వాత మారుతి సుజుకి కార్ల ధరలను సవరించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Continues below advertisement

Read Also: Honda Activa e vs TVS iQube: యాక్టివా ఇ స్కూటర్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్, ధర,మైలేజీలో ఏద బెస్ట్? పూర్తి పోలిక ఇక్కడ!

పెంపుపై క్లారిటీ..

Continues below advertisement

ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి ఈ ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా అంతర్గత చర్యల ద్వారా వ్యయాల పెరుగుదలను అరికట్టడానికి ప్రయత్నించినట్లు పేర్కొంది. అయితే కమోడిటీ ధరలు, లాజిస్టిక్స్ ఖర్చులు, మొత్తం ఇన్‌పుట్ వ్యయాలు గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటంతో ఆ భారంలో కొంత భాగాన్ని కస్టమర్లపై మోపక తప్పలేదని వెల్లడించింది. కార్ల మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల పెంపు మారుతూ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు జూన్ మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి.

Read Also: Sachin Tendulkar Car Collection: సచిన్ సూప‌ర్బ్ కార్ క‌లెక్ష‌న్: క్రికెట్ గాడ్ లగ్జరీ గ్యారేజ్ లోని టాప్ కార్ల కలెక్షన్ పై ఒక లుక్ 

ఆల్టో నుండి ఇన్విక్టో వరకు ..

ఈ తాజా నిర్ణయం మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాలపై పడనుంది. బడ్జెట్ రేంజ్ హ్యాచ్‌బ్యాక్స్ అయిన ఆల్టో కే10, ఎస్-ప్రెస్సోలతో పాటు భారీ డిమాండ్ ఉన్న వ్యాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ కార్ల రేట్లు పెరగనున్నాయి. అలాగే ప్రీమియం మోడళ్లయిన బాలెనో, ఫ్రాంక్స్, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, హై-ఎండ్ మోడల్ ఇన్విక్టో కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం మారుతి సుజుకి శ్రేణిలో ఆల్టో కే10 ప్రారంభ ధర రూ. 3.70 లక్షలు కాగా, ఇన్విక్టో టాప్ ఎండ్ ధర రూ. 28.61 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా వస్తున్న సీఎన్‌జీ, హైబ్రిడ్ వెహికల్స్ ధరలు కూడా ఈ మార్పుతో అప్‌డేట్ కానున్నాయి.

మారుతున్న సమీకరణాలు

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ రంగంలో ముడిసరుకు ఖర్చులు పెరగడం, కొత్త నిబంధనల అమలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఇంటెగ్రేషన్ కారణంగా దాదాపు అన్ని కంపెనీలు ధరలను క్ర‌మంగా సవరిస్తున్నాయి. ఆటోమేకర్లు ఒకవైపు పెరిగిన ఉత్పత్తి వ్యయాలను బ్యాలెన్స్ చేస్తూనే, మరోవైపు మార్కెట్ డిమాండ్ తగ్గకుండా చూసుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ కస్టమర్లు ఉండే ప్రైస్ సెన్సిటివ్ సెగ్మెంట్లలో అమ్మకాలను కాపాడుకోవడం కంపెనీలకు ఇప్పుడు సవాలుగా మారింది. జూన్ నుండి అమల్లోకి రాబోయే ఈ రేట్ల మార్పు కొత్త కారు కొనాలనుకునే వారి బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.