Maruti first 7 seater EV YMC | మారుతి సుజుకి భారతదేశంలో వచ్చే ఏడాది అనేక కొత్త కార్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. వీటిలో మారుతి e విటారా ఎలక్ట్రిక్ SUVతో పాటు కొత్త ఎలక్ట్రిక్ ఫ్యామిలీ కారు కూడా ఉంది. ఈ కొత్త కారును కంపెనీ మారుతి YMC పేరుతో రూపొందించనుంది. ఇది భారతదేశంలో మారుతి కంపెనీ రెండవ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ఇటీవల తమ తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయడం తెలిసిందే. ప్రత్యేకంగా కుటుంబంతో వెళ్లాలనుకునే వారిని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ ఎలక్ట్రిక్ MPVని ఎర్టిగా, XL6 కంటే ఎక్కువ విభాగంలో ఉంచాలని మారుతి కంపెనీ యోచిస్తోంది. తద్వారా ఎక్కువ స్థలంతో పాటు మెరుగైన ఫీచర్‌లను పొందవచ్చు.

Continues below advertisement

కియా కారెన్స్ EVతో నేరుగా పోటీ

మారుతి నుంచి రాబోయే ఈ 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు నేరుగా కియా కారెన్స్ క్లావిస్ EVకి పోటీ పడుతుంది. ఈ 2 కార్లు కూడా ఫ్యామిలీ జర్నీకి ఉపయోగించే కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. కియా ఇప్పటికే ఈ విభాగంలో సన్నాహాలు చేస్తుండగా, మారుతి తన బ్రాండ్ విలువ, సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా మార్కెట్‌లో పెద్ద ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ధర, నిర్వహణ ఖర్చుల పరంగా మారుతి ఈ విభాగంలో మంచి ఎంపికను అందించగలదని భావిస్తున్నారు.

మారుతి YMC ఎలక్ట్రిక్ MPV విడుదల ఎప్పుడు ?

మారుతి సుజుకి ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, మీడియా రిపోర్ట్స్ ప్రకారం, ఈ కారు 2026 చివరి నాటికి భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2026 నుండి దీని ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.  ఈ కారు రాబోయే మారుతి e విటారా ఎలక్ట్రిక్ SUV తయారు చేసిన అదే 27PL ప్లాట్‌ఫారమ్‌లో తయారు చేయనున్నారు. దీనితో కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ టెక్నాలజీపై వేగంగా పనిచేస్తోందని స్పష్టమవుతుంది.

Continues below advertisement

బ్యాటరీ, కి.మీ రేంజ్ 

మారుతి YMCలో e విటారాలో అందించే అదే తరహాలో బ్యాటరీ ఎంపికలు ఉండవచ్చు. ఇందులో 49kWh బ్యాటరీతో పాటు 61kWh బ్యాటరీ ప్యాక్‌లు వచ్చే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో, ఈ కారు దాదాపు 343 కిలోమీటర్ల రేంజ్ జర్నీ ఇవ్వగలదు. అయితే పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో దీని పరిధి దాదాపు 543 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని అంచనా వేశారు. ఇంత పరిధితో ఈ ఎలక్ట్రిక్ MPV సుదూర ప్రయాణాలకు కూడా సరైన ఎంపికగా భావించవచ్చు. మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. మారుతి కంపెనీ దేశంలోని 1,100 కంటే ఎక్కువ నగరాల్లో 2,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 2030 నాటికి డీలర్లు, ఛార్జింగ్ భాగస్వాములతో కలిసి 1 లక్ష కంటే ఎక్కువ EV ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని మారుతి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read: పెట్రోల్ వాహనాలతో పోలిస్తే CNG వాహనాలు ఎందుకు ఎక్కువ దూరం నడుస్తాయంటే?