Impact On GST Slab Change on Car Market Latest News: భారత ప్యాసింజర్ వెహికల్ పరిశ్రమకు సెప్టెంబర్ నెల శుభారంభంగా మారింది. గత నాలుగు నెలల మాదిరే, ఆగస్టులో నెమ్మదిగా అమ్మకాలు సాగాయి, అయితే సెప్టెంబర్ మొదటి వారంలోనే చాలా ఉత్కంఠభరిత ఆవిష్కరణలు, లాంచ్లు చోటు చేసుకున్నాయి, ఇవి భారత కార్ మార్కెట్ను ఉత్తేజపరిచాయి. నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ విక్టోరిస్ SUV ఆవిష్కరించబడింది, అలాగే హ్యూండాయ్ కంపెనీ క్రెటా కింగ్ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ జోరులోనే, సెప్టెంబర్లో ఇంకా చాలా కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . ముఖ్యంగా విన్ఫాస్ట్ VF6 m VF7... కార్ల విడుదలలతో పాటు, భారత ప్యాసింజర్ వెహికల్ పరిశ్రమకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం ఏంటంటే, జీఎస్టీ కౌన్సిల్ కార్లపై పన్నులను తగ్గించింది, ముఖ్యంగా చిన్న కార్లపై. కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.
అత్యున్నత మోడల్..ఇక ఇప్పటివరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలను పరిశీలిస్తే: మారుతీ సుజుకీ తన కొత్త మిడ్-సైజ్ SUV అయిన విక్టోరిస్ను ఆవిష్కరించింది, ఇది అరేనా సిరీస్లో అత్యున్నత మోడల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ SUV మోడల్ను త్వరలో మార్కెట్లో విడుదల చేయనున్నదిగా కంపెనీ తెలిపింది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారుకు కొత్త డిజైన్, ఆధునిక సాంకేతిక ఫీచర్లు, హైబ్రిడ్ సహా శక్తివంతమైన పవర్ట్రెయిన్ ఎంపికలు లభించనున్నాయి. అలాగే, హ్యూండాయ్ క్రెటా భారత మార్కెట్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, క్రెటా కింగ్, కింగ్ నైట్, కింగ్ లిమిటెడ్ ఎడిషన్ లను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్లకు కొత్త ఎక్స్టీరియర్, ఇంటీరియర్ , ఫీచర్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేక వెర్షన్లు మిడ్-సైజ్ SUV మార్కెట్లో క్రెటా బ్రాండ్ను మరింత బలోపేతం చేసేందుకు ఉపకరించనుందని కంపెనీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
కీలక నిర్ణయాలు..ఇక పన్నుల విషయానికి వస్తే, దేశీయ వినియోగాన్ని పెంచడం , ఆర్థిక వ్యవస్థను పునరుత్థాన పరచడం లక్ష్యంగా, జీఎస్టీ కౌన్సిల్ పలు వాహన శ్రేణులపై పన్ను తగ్గింపులను ప్రకటించింది. ఇప్పటివరకు 28% జీఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఎక్కువ భాగం ప్యాసింజర్ వాహనాలపై 18% జీఎస్టీ మాత్రమే ఉండనుంది. కొన్ని పెద్ద కార్లపై 40% వరకు పన్ను ఉండనుంది, అయినప్పటికీ ఇది గతంలో ఉన్న పన్ను భారం కంటే తక్కువేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈనెల 22 నుంచి సవరించబడిన జీఎస్టీ అమల్లోకి రానుండటంతో కార్ల అమ్మకాలు మరింతగా పెరగనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.