Hyundai V2G Technology: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ అవసరం లేని వాహనాలుగా మాత్రమే కాకుండా, భవిష్యత్‌లో ఇవి శక్తి వనరులుగా మారబోతున్నాయి. ఈ దిశగా దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్‌ మోటార్ గ్రూప్‌ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. దక్షిణ కొరియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం జెజు ఐలాండ్‌లో వ్యక్తిగత ఎలక్ట్రిక్‌ వాహన యజమానుల కోసం వెహికల్‌ టు గ్రిడ్‌ టెక్నాలజీ (Hyundai V2G Technology)పైలట్‌ ప్రాజెక్టును ఆ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. 

Continues below advertisement

ఈ వీ2జీ టెక్నాలజీ ఏంటీ?

సాధారణంగా మనం ఎలక్ట్రిక్ వాహనాన్ని(Electric Vehicles) ఛార్జింగ్ సాకెట్‌కు అనుసంధానించినప్పుడు, గ్రిడ్‌ నుంచి విద్యుత్ వాహనంలోని బ్యాటరీకి చేరుతుంది. అయితే వీ2జీ టెక్నాలజీ దీనికి భిన్నంగా పని చేస్తుంది. ఇది వాహనాన్ని ఒక మొబైల్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌గా మారుస్తుంది. అంటే వాహనంలోని బ్యాటరీలో ఉన్న విద్యుత్‌ను అవసరమైనప్పుడు తిరిగి పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేయవచ్చు. దీని వల్ల కారు కేవలం ప్రయాణ సాధనమే కాకుండా, ఒక నడిచే పవర్ బ్యాంక్‌లా ఉపయోపడుతుంది. 

Also Read: ఐఐటీ హైదరాబాద్‌, కాన్పూర్‌తో హ్యుందాయ్ ఒప్పందం! ఫ్యూచర్ ప్లాన్ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

ప్రాజెక్టులో ఎవరు భాగమై ఉన్నారు?

హ్యుందాయ్‌ మోటార్ గ్రూప్‌ ఈ ప్రాజెక్టును జెజు స్థానిక అధికారుల సహకారంతో చేపట్టింది. ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా 40 మంది ప్రైవేటు వాహన యజమానులను ఎంపిక చేశారు. ఇందులో పాల్గొనే వారు హ్యుందాయ్‌కి చెందిన loniq9 (Hyundai Ioniq 9)లేదా కియాకి చెందిన ఈవీ 9(Kia EV9) మోడళ్లను కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ వాహనాలు వీ2జీ సాంకేతికతకు అనుకూలంగా రూపొందించారు. 

Continues below advertisement

Also Read:హ్యాందాయ్‌ నుంచి 10 లక్షల బడ్జెట్‌లో ఉన్న మోడల్స్ ఇవే! కారు కొనే ముందు ఓ లుక్‌ వేయండి!

గతంలో అంటే 2025 ద్వితీయార్థంలో, హ్యుందాయ్ సోకార్‌ అనే మొబిలిటీ ప్లాట్‌ఫామ్‌తో కలిసి ప్రాథమిక పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు దీనిని నేరుగా సాధారణ వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించిన అధికారిక ప్రకటన నేడు (మే 15న) వెలువడింది. 2025లో నిర్వహించిన పైలట్ ప్రోగ్రామ్‌ విజయవంతం కావడంతో ఇప్పుడు దీనిని మరింత మందికి చేరువ చేస్తూ హ్యుందాయ్‌ నిర్ణయం తీసుకుంది. 

ఎందుకు జేజు ఐలాండ్‌ ఎంచుకున్నారు?

జెజు ఐలాండ్‌ (Jeju Island )ఈ ప్రయోగానికి అత్యంత అనువైన ప్రాంతం. ఇక్కడ గాలి, సౌర శక్తిపై ఆధారపడి ప్రజలు జీవిస్తారు. అయితే ప్రకృతి సిద్ధంగా లభించే ఈ విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గ్రిడ్‌లో అవసరానికి మించి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ సమయంలో అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఈవీ బ్యాటరీల్లో స్టోర్ చేయవచ్చు. విద్యుత్ ఉత్పత్తి తగ్గినా లేదా డిమాండ్ పెరిగినా వాహనాల్లో నిల్వ ఉన్న శక్తిని తిరిగి గ్రిడ్‌కు పంపి సరఫరాను స్థిరీకరించవచ్చు. దీని వల్ల విద్యుత్‌ వృథా కాకుండా ఉండటమే కాకుండా పవర్‌ గ్రిడ్‌పై భారం పడదు. 

Also Read: EV త్రీ-వీలర్ మార్కెట్లో సంచలనం.. హ్యుందాయ్, టీవీఎస్ మోటార్స్ Joint Venture! దేశీ రోడ్ల కోసం స్పెషల్ ఎలక్ట్రిక్ ఆటోలు

దీని వల్ల ప్రయోజనం ఏంటీ?

ఈ ప్రాజెక్టులో పాల్గొనే వాహన యజమానులకు హ్యుందాయ్‌ భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది. వీ2జి(Vehicle to Grid) సపోర్ట్ చేసే ప్రత్యేక ఛార్జర్లను హ్యుందాయ్ ఉచితంగా ఇన్‌స్టాల్చేస్తుంది. పైలట్ ప్రాజెక్టు నడుస్తున్న కాలంలో వాహన యజమానులు తమ కార్లను ఛార్జ్ చేసుకునేందుకు ఎలాంటి ఫీజు వసూలు చేయాల్సిన అవసరం లేదు. దీనిని కంపెనీయే భరిస్తుంది. పునరుత్పాదక ఇంధనాన్ని సమర్థవంతంగా వాడటం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించవచ్చు. 

Also Read: ఎండల్లో సేఫ్ డ్రైవింగ్ టిప్స్ - సమ్మర్ గ్లేర్ నుండి తప్పించుకోవడానికి ఎన్ హెచ్ఏఐ కీలక సూచనలు

భారత్ వంటి దేశాల్లో కూడా విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతోంది. బెజు ఐలాండ్‌లో జరుగుతున్న ప్రయోగం విజయవంతం అయితే భవిష్యత్‌లో మన దేశంలో కూడా ఇలాంటి సాంకేతికను చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా సోలార్ పవర్‌ ఎక్కువగా వాడే ప్రాంతాల్లో వీ2జి టెక్నాలజీ ఒక విప్లవమే అవుతుంది.