Hyundai Car Price Hike June 2026:భారత్ వాహన రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తన వినియోగదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్1 నుంచి తన అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గడిచిన రెండు నెలల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా, ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఈ ధరల పెంపు వెనుక ఉన్న ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, సామాన్య కొనుగోలుదారునిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 

Continues below advertisement

హ్యుందాయ్‌ అధికారిక ప్రకటన ప్రకారం కొత్త ధరలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ పెంపు అనేది కంపెనీ విక్రయించే ప్రతి మోడల్‌పై వర్తిస్తుంది. అంటే ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ వరకు అన్ని ఖరీదైనవి కానున్నాయి. 

వేరియంట్, మోడల్‌ను బట్టి గరిష్టంగా 12,800 వరకు ధర పెరగనుంది. హ్యుందాయ్‌ క్రెటా, వెన్యూ, అల్కాజర్‌ వంటి పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.  

Continues below advertisement

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని ప్రధాన మోడళ్ల ప్రారంభ ధరలను గమనిస్తే... హ్యుందాయ్‌ క్రెటా 10.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెన్యూ 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్‌ అల్కాజర్‌ 14. 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 

కంపెనీ ఈ ధరల పెంపును కేవలం ఒక నిర్ణయంగా కాకుండా, ఒక అనివార్య పరిస్థితిగా అభివర్ణించింది. దీనికి ప్రధానంగా మూడు కారణాలను హ్యుందాయ్‌ పేర్కొంది. 

కార్ల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల ధరలు గ్లోబల్ మార్కెట్‌లో విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఉక్కు అల్యూమినియం, ఇతర లోహాల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం భారమైంది. గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ రవాణా కారిడార్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీని వల్ల లాజిస్టిక్స్‌,రవాణా ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. ఇది అంతిమంగా కారు ధరపై ప్రభావం చూపుతోంది. 

కారు కొనాలనుకునే వారు జూన్ 1లోపు బుకింగ్ చేసుకోవడం ద్వారా  అదనపు ధర నుంచి తప్పించుకోవచ్చు. గల్ఫ్ సంక్షోభం వంటి అంతర్జాతీయ అంశాలు పరిష్కారమైతే తప్ప, వాహన ధరలు స్థిరంగా ఉండే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. హ్యుందాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.