Subsidies On Purchases Of Electric Cars And Bikes In India: భారతదేశంలో, ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల గాలి వీస్తోంది. డబ్బులు ఆదా చేసుకోవడం కోసమో లేదా పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతోనో ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్లు, బైకులను కొంటున్నారు. భారతదేశంలో ప్రతి రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహన (EV) పాలసీని అమలు చేస్తోంది. ఈ పాలసీ ప్రకారం వివిధ రకాల సబ్సిడీలు, ఇన్సెంటివ్‌లు, రోడ్ టాక్స్ మినహాయింపులు, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో తగ్గింపులు వంటి ప్రయోజనాలు అందిస్తోంది. ఈ బెనిఫిట్స్‌ రాష్ట్రాన్ని బట్టి మారతాయి. 

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు (కార్లు, SUVలు)

రాష్ట్రం  సబ్సిడీ (ప్రతి kWhకి)  గరిష్ట సబ్సిడీ  రోడ్ టాక్స్ మినహాయింపు
మహారాష్ట్ర ₹5,000    ₹2,50,000    100%
అస్సాం ₹10,000    ₹1,50,000 100%
గుజరాత్   ₹10,000 ₹1,50,000  50%  
పశ్చిమ బెంగాల్ ₹10,000  ₹1,50,000 100%
మేఘాలయ  ₹4,000     ₹60,000  100%
బీహార్     ₹10,000 ₹1,50,000    100%
రాజస్థాన్     లేదు   లేదు   NA
ఒడిశా NA   ₹1,00,000  100%     
పంజాబ్ లేదు   ₹1,00,000   100%
తెలంగాణ లేదు లేదు 100%
కేరళ లేదు లేదు 50%
ఉత్తర ప్రదేశ్ లేదు లేదు 75% 
కర్ణాటక    లేదు లేదు 100%
ఆంధ్రప్రదేశ్ లేదు లేదు 100%
తమిళనాడు లేదు లేదు 100%
మధ్యప్రదేశ్  లేదు లేదు  99%

 

ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకుల కొనుగోలుపై రాష్ట్రంవారీగా సబ్సిడీలు

రాష్ట్రం  సబ్సిడీ (ప్రతి kWhకి)  గరిష్ట సబ్సిడీ  రోడ్ టాక్స్ మినహాయింపు
మహారాష్ట్ర ₹5,000    ₹25,000 100%
గుజరాత్ ₹10,000    ₹20,000 50%  
పశ్చిమ బెంగాల్ ₹10,000 ₹20,000 100%  
కర్ణాటక  లేదు లేదు 100%
తమిళనాడు  లేదు లేదు 100%
ఉత్తర ప్రదేశ్    లేదు లేదు 100%
బీహార్ ₹10,000       ₹20,000 100%
పంజాబ్    లేదు లేదు  100%
కేరళ లేదు లేదు 50%
తెలంగాణ  లేదు లేదు 100%
ఆంధ్రప్రదేశ్ లేదు లేదు 100%
మధ్యప్రదేశ్   లేదు లేదు 99%
ఒడిశా NA  ₹5,000  100%
రాజస్థాన్ ₹2,500  ₹10,000   NA
అస్సాం     ₹10,000 ₹20,000 100%
మేఘాలయ ₹10,000 ₹20,000 100%

కీలకాంశాలు:

మహారాష్ట్ర: 2025 EV పాలసీ ప్రకారం, ప్రైవేట్ కార్లకు 10% సబ్సిడీ, టోల్ ఫ్రీ ట్రావెల్, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు.గుజరాత్: కార్లకు ₹1.50 లక్షల వరకు & బైకులకు ₹20,000 వరకు సబ్సిడీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు.పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్: కార్లకు ₹1.5 లక్షల వరకు, బైక్‌లకు ₹20,000 వరకు రాయితీ, రోడ్ టాక్స్ మినహాయింపు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ & రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో మినహాయింపు.కేరళ: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఇ-రిక్షాలకు ₹10,000 నుంచి ₹30,000 వరకు సబ్సిడీ.మధ్యప్రదేశ్: కార్లకు, బైక్‌లకు సబ్సిడీలు లేవు. కానీ, రోడ్ టాక్స్ 99% తగ్గింపు.ఒడిశా: కార్లకు ₹1 లక్ష వరకు, బైక్‌లకు ₹5,000 వరకు రాయితీ + రోడ్ టాక్స్ మినహాయింపు.రాజస్థాన్: కార్లకు సబ్సిడీలు లేవు, బైక్‌లకు ₹10,000 వరకు సబ్సిడీ.