Hero MotoCorp Launches First Flex Fuel Motorcycles: ఇండియాలోనే బిగ్గెస్ట్ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి తెచ్చింది. మోస్ట్ పాపులర్ మోడల్స్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇండియాలో ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని, ముఖ్యంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Continues below advertisement

Read Also: Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌!

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫీచర్లు.. 

Continues below advertisement

ఈ కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ప్రారంభ ధరను రూ. 82,710 (ఎక్స్-షోరూమ్) గా ఫిక్స్ చేశారు. ఇందులో ఈ85 (E85) ఇంధనానికి సపోర్ట్ చేసే 97.2 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 8 హెచ్ పీ పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సాధారణ మోడల్ కంటే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ బైక్ ఈ20 నుంచి ఈ85 వరకు ఎలాంటి ఇథనాల్ బ్లెండ్ నైనా సపోర్ట్ చేస్తుంది. ఇందులో హీరో i3S స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, డిజిటల్ అనలాగ్ మీటర్, ట్యూబ్ లెస్ టైర్లు, సరికొత్త ఈసీయూ (ECU) సిస్టమ్ ను అమర్చారు. లుక్ పరంగా లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ తో కూడిన బ్లాక్ కలర్ లో ఈ బైక్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.

Read Also: కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

తక్కువ ధరలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. 

ఇంకా తక్కువ బడ్జెట్ లో బైక్ కావాలనుకునే వారి కోసం హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ను రూ. 72,792 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో కూడా సేమ్ 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది ఇథనాల్ ఇంధనంపై రన్ అవుతూ 8 హెచ్ పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. స్ప్లెండర్ లాగే ఇది కూడా ఈ20 నుంచి ఈ85 ఫ్యూయల్ కాన్ఫిగరేషన్ కు సపోర్ట్ ఇస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, అప్‌గ్రేడెడ్ ఫ్యూయల్ సిస్టమ్, సరికొత్త డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఇది కూడా బ్లాక్ విత్ లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ తో కొత్త లుక్ లో మార్కెట్ కు వచ్చింది.

 ఇంధన భద్రతకు కీలక అడుగు

ఈ లాంచ్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ క్లీనర్ మొబిలిటీ వైపు ఇండియా వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. మాస్ సెగ్మెంట్ లో హీరో కంపెనీ తెచ్చిన ఈ బైకులు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ను తగ్గించి రైతులను ఆర్థికంగా ఆదుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంచడానికి ఇదొక మైలురాయి లాంటిదని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా స్వయంసమృద్ధి సాధించడంలో బయో ఫ్యూయల్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.