Best Electric Scooters Under 50000: చమురు సంక్షోభం వెంటాడుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ప్రజలు ఈవీలను, పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్ను ఎక్కువ ఉపయోగించుకోవాలని సూచించారు. అయితే పబ్లిక్ ట్రాన్స్ఫోర్ట్లో ట్రావెల్ చేసేందుకు ఇష్టం లేని వాళ్లు తక్కువలో కొనగలిగే ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం 50 వేల రూపాయల కంటే తక్కువ ధరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈవీలను పరిశీలిద్దాం.
ఒకప్పుడు ఈవీలు అంటే లక్షల రూపాయలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతోపాటు అందుబాటు ధరల్లోనే ఈవీలను అమ్మకానికి ఉంచుతున్నారు. ముఖ్యంగా నగరాల్లో తక్కువ దూరాలు ప్రయాణించేందుకు, విద్యార్థులు, వృద్ధుల అవసరాల కోసం రూపొందించిన లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో20 వేల నుంచి ఈ స్కూటర్లు అమ్మకానికి ఉన్నాయి.
30 వేల రూపాయల బడ్జెట్ విభాగంలో గ్రీన్ ఈవీ వంటి కంపెనీలు తక్కువ ధరకే వాహనాలను అందిస్తున్నాయి. ఇవి ప్రాథమిక అవసరాలు ఎంతో అనువైనవి.
గ్రీన్ ఉడాన్
ఈ వెహికల్ ప్రారంభ ధర 27, 362. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. 30 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్, 60 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే మోడల్ అందుబాటులో ఉన్నాయి. ఈ వాహనంలో 250 వాట్ల మోటార్ అమర్చి ఉంటుంది. బ్యాటరీ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది.
గ్రీన్ సన్నీ
దీని ధర సుమారు 29 , 438. ఒకసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. గమనించ దగ్గ విషయం ఏంటంటే, ఈ విభాగంలోని వాహనాల గరిష్ట వేగం 30 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉంటుంది.
30 వేల నుంచి 50 వేల మధ్య లభించే ఈ స్కూటర్లు
ఈ విభాగంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. సుమారు 21 మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
యాకుజా ఎలక్ట్రిక్
ఈ కంపెనీ అనేక మోడల్స్ను అందిస్తోంది. యాకుజా రూబీ మోడల్ 38, 318 నుంచి ప్రారంభమవుతుంది. ఒక ఛార్జ్ చేస్తే 55 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఇందులో 48V, 60V, 72V వంటి వివిధ బ్యాటరీ వేరియంట్లు ఉన్నాయి. యాకూజా న్యూ ధర 40, 025 నుంచి ప్రారంమవుతుంది. ఇది 55 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. యాకుజా విరాజ్, అంబర్ మోడల్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇందులో విరాజ్ మోడల్ ధర 41, 509 కాగా, అంబర్ మోడల్ ధర 46, 676 నుంచి ప్రారంభమవుతుంది.
కోమకి
నమ్మకమైన బ్రాండ్గా ఎదిగిన కోమకి తక్కువ ధరల్లోనే మంచి రేంజ్ ఇస్తోంది. కోమకి ఎక్స్వన్ ధర 38,032. గ్రాఫిన్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్ 60కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. ఇందులో 70 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే లిథియం అయాన్ మోడల్ కూడా 46, 162 రూపాయలకు లభిస్తుంది. కోమకి ఎక్స్ జీటీ కేఎం 43, 876 రూపాయలకు లభించే స్కూటర్ ఏకంగా వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
భారీ రేంజ్ ఇచ్చే స్కూటర్లు
43, 114 రూపాయల ధరకు లభించే వారివో నియో 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. జెలో జూప్ 49, 110 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ మోడల్ బ్యాటరీ రకాన్ని బట్టి 65 నుంచి 140 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు.
బడ్జెట్ ఈవీలలో బ్యాటరీ చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో మూడు రకాల బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. లెడ్ యాసిడ్ బ్యాటరీలు చాలా చౌకగా ఉంటాయి. కానీ బరువు ఎక్కువ. టన్వాల్ మినీ లిథినో వంటి మోడళ్లు వీటిని వాడుతున్నాయి.
లిథియం అయాన్ తేలికగా ఉంటుంది. ఎక్కువ కాలం మన్నుతాయి. కోమకి ఎక్స్ వన్లో వీటిని చూడవచ్చు. గ్రాఫిన్ బ్యాటరీ జెలో జూప్ , కోమకి వంటి మోడల్స్లో చూడవచ్చు. ఇవి వేగంగా ఛార్జ్ అవుతాయి.
భారత ప్రభుత్వం ఫే్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడటంతో తయారీ వ్యయం తగ్గి సామాన్యులకు ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. 50 వేల లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు ఒక ఆచరణాత్మకమైన ఎంపికగా మారాయి. తక్కువ వేగం ఉన్నప్పటికీ, నగర జీవితంలో ఇవి సౌలభ్యం, ఆర్థిక పొదుపు సాటిలేనిది.
