Baba Vanga Predictions : బాబా వంగా ఒక ప్రసిద్ధ బల్గేరియన్ భవిష్యత్ వక్త.  అసలు పేరు వంగెలియా పాండెవా గుష్టెరోవా.  భవిష్యత్తును చూడగలగడం వల్ల ప్రజలు ఆమెను  బాబా వంగా అని పిలుస్తారు. ఆమె 1911లో బల్గేరియాలో జన్మించారు  - 1996లో మరణించే ముందు 5079 వరకు భవిష్యవాణి చెప్పారు. 

బాబా వంగా 2025ను విషాదంతో నిండిన సంవత్సరంగా పేర్కొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అస్థిరత , మానవ నాగరికత పతనం ప్రారంభమవుతుందని జ్యోతిష్యం చెప్పారు.  అంతేకాకుండా, ఆమె 2025లో మానవులు -  గ్రహాంతరవాసుల మధ్య సంబంధం గురించి కూడా మాట్లాడారు.

బాబా వంగా జోస్యాలుచిన్నతనంలో తుఫాను కారణంగా ఆమె దృష్టి కోల్పోయింది, దీని కారణంగా ప్రజలు ఆమెను అంధ భవిష్యత్ వక్త అని కూడా పిలుస్తారు. ఆమె తన జీవితకాలంలో 5079 వరకు భవిష్యవాణి చెప్పారు. అయితే, ఈ జోస్యాలన్నీ ఆమె స్వయంగా రాయలేదని, ఆమె అనుచరులు , కొన్ని మీడియా నివేదికలు చెప్పాయి.  అందుకే వీటిలో ఏవి నిజం? ఏవి కల్పితం అన్నది కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. 

బాబా వంగా నిజమైన జోస్యాలు-

  • 9/11 దాడి
  • 2004 సునామీ
  • బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికవడం 
  • బ్రెగ్జిట్ 
  • సోవియట్ యూనియన్ పతనం

బాబా వంగా మద్దతుదారులు ఆమె చేసిన అనేక జోస్యాలు నిజమయ్యాయని చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు - చరిత్రకారులు ఈ జోస్యాలను కేవలం యాదృచ్చికంగా భావిస్తున్నారు. 

బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించిన ముఖ్యమైన జోస్యాలు
బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించి  జోస్యం చెబుతూ, యూరప్‌లో మానవ శరీరాలపై ప్రమాదకరమైన జీవసంబంధిత ప్రయోగాలు చేస్తారని పేర్కొన్నారు. 
 2025లో యూరప్ ఆర్థిక సంక్షోభం, యుద్ధం లేదా మహమ్మారి వంటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావొచ్చు. 
ఆమె జోస్యాలలో అత్యంత ఆసక్తికరమైనది ఏమిటంటే 2025లో మానవులు గ్రహాంతరవాసులు లేదా ఇతర గ్రహాల ప్రజలతో సంబంధం కలిగి ఉండటం. 
బాబా వంగా జోస్యాలలో ప్రకృతి వైపరీత్యాలు , వాతావరణ సంక్షోభం కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆసియా , అమెరికా, జపాన్ దేశాలు దీనిని ఎదుర్కోవలసి ఉంటుంది. 
బాబా వంగా 2025లో చిన్న స్థాయిలో సైనిక ఘర్షణలు జరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేశారు.

 

 

 

నిజమయ్యే అవకాశం ఉన్న జోస్యాలువాతావరణ సంక్షోభం,  ప్రకృతి వైపరీత్యాల గురించి జోస్యాలు నిజం అయ్యే అవకాశం ఉంది.  ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా దీని గురించి పెద్ద సూచన చేస్తున్నారు.

వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. 2024-25లో రికార్డు స్థాయిలో వేడి, వరదల విపత్తులు సంభవించాయి. 

బాబా వంగా సైనిక ఉద్రిక్తత ,  యుద్ధం గురించి చేసిన జోస్యం కూడా నిజం కావొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో ఉన్న  రాజకీయ పరిస్థితులు సాధారణంగా లేవు, ఇందులో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-గాజా, భారతదేశం మరియు చైనా సరిహద్దు వివాదం ఉన్నాయి, ఇది ఏదో ఒక విధంగా ఈ జోస్యాన్ని నిజం చేస్తోంది. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా సేకరించి రాసినది మాత్రమే. ABP దేశం ఇలాంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించడం లేదు.ఈ సమాచారాన్ని విశ్వసించే ముందు సంబంధిత నిపుణుల సలహాలు స్వీకరించండి. 

పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణ అని ఎందుకంటారు! మహాభారతంలో ఉన్న ఆ రహస్యం ఏంటి?...పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి