Couple Died in Within Hours in East Godavari District: తూర్పు గోదావరి (East Godavari) జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం జరిగింది. అనారోగ్యంతో ఓ వృద్ధుడు మృతి చెందగా.. ఆయన భార్య కూడా మనో వ్యధతో గంటల వ్యవదిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గోకవరం (Gokavaram) మండలం తంటికొండ (Thantikonda) గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కోసూరి సత్యనారాయణ (77) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు, కుమార్తెకు వివాహం జరిపించాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న వృద్ధుడు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన అతని భార్య వరలక్ష్మి (65) భర్త మృతదేహం పక్కనే ఏడుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వృద్ధ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండే వారని.. వారు ఒకే రోజు మృతి చెందడం బాధా కరమని గ్రామస్థులు ఆవేదన చెందారు.


Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో విష జ్వరాల విజృంభణ - ప్రజల ఆందోళన