Rushikonda Palace as a luxury hotel: విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన వివాదాస్పద భవనాలను లగ్జరీ హోటల్‌గా మార్చేందుకు ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్  IHCL-తాజ్ గ్రూప్) , లీలా ప్యాలెస్ హోటల్స్ సహా లెమన్ ట్రీ, మహీంద్రా, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే హోటల్ గా ఉపయోగించడానికి సాధ్యమా కాదా అన్నదానిపై  కొన్ని అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు కొనసాగుతున్నాయి.               

Continues below advertisement

రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించాలన్నదానిపై మంత్రుల బృందం చర్చలు           

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (GoM) వివిధ ఆప్షన్లను ఖరారు చేసిన తర్వాత తమ సిఫారసులను ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ ముందు ఉంచనుంది. ఈ భవనాలను పర్యాటక రంగంలో ఆదాయ వనరుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. మంగళవారం సమావేశం అయిన  మంత్రుల బృందం .. మరోసారి సమావేశం తర్వాత సిఫారసులు సమర్పించే అవకాశం ఉంది. 

Continues below advertisement

హోటల్ గా మార్చేందుకు పలు ముఖ్య సంస్థల ఆసక్తి                

రుషికొండ భవనాలను లగ్జరీ హోటల్‌గా అభివృద్ధి చేయాలని పలు ప్రముఖ హోటల్ చైన్‌లు ప్రతిపాదనలు సమర్పించాయి.   టాటా గ్రూప్ (IHCL), లీలా ప్యాలెస్, లెమన్ ట్రీ, మహీంద్రా హాలిడేస్, మారియట్ వంటి సంస్థలు ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ఆసక్తి వ్యక్తం చేశాయి.  అయితే, ప్రాజెక్టు వాణిజ్య సాధ్యత, పర్యావరణ అనుమతులు, నిర్మాణ ఖర్చులు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలపై కొన్ని సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.  ఈ అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్తి స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని, మరికొన్ని మైస్  అంటే మీటింగ్స్, ఇన్‌సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఎగ్జిబిషన్స్  హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచిస్తున్నాయి.

వైసీపీ హయాలో రూ.450 కోట్లతో నిర్మాణం                         

 వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండపై సుమారు రూ.450 కోట్లతో ఈ భవనాలు నిర్మించారు. పర్యాటక అభివృద్ధి పేరుతో నిర్మాణం జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు, ధన దుర్వినియోగం ఆరోపణలతో వివాదాస్పదమయ్యాయి.  2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ భవనాల భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి ఆగస్టు 2025లో మంత్రుల బృందం  ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2025లో ప్రజల నుంచి, సంస్థల నుంచి సూచనలు కోరగా పలు ప్రతిపాదనలు వచ్చాయి. అందులో అంతర్జాతీయ కాన్సులేట్‌లు, పర్యాటక హబ్, వెడ్డింగ్ డెస్టినేషన్ వంటి  ఐడియాలు ఇచ్చారు.  ప్రస్తుతం భవనాలు ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ఆధీనంలో ఉన్నాయి. వీటి కోసం భారీగా ఖర్చు పెట్టినందున  దానికి తగ్గ ఆదాయం వచ్చేలా చూడాలని .. టూరిజంకు ఆర్థిక లాభం ఉండాలని మంత్రుల బృందం ప్రయత్నిస్తోంది.