MP Family Kidnap Story :  విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారం సంచలనం అవుతోంది. అసలు ఓ సాధారణ రౌడీ షీటర్ ఎంపీ కుటుంబాన్ని ఎలా టార్గెట్ చేశాడనేది పోలీసులకూ కూడా అంతు చిక్కకుండా ఉంది. అయితే ఎంపీ కుటుంబం గురించి  పూర్తిగా తెలుసుకుని రెక్కీ కూడా నిర్వహించి రౌడీషీటర్ హేమంత్ రంగంలోకి దిగాడని  భావిస్తున్నారు. 


ఒంటరిగా ఎంపీ ఎంవీవీ కుమారుడు - హేమంత్‌కు తెలియడంతో రంగంలోకి  ! 


ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడి వివాహం ఇటీవలే  జరిగింది తనకంటూ ప్రైవసీ కావాలనే ఉద్దేశంతో ఓ పెద్ద ఇల్లు నిర్మాణం చేపట్టి కుమారుడికి  గిఫ్టుగా ఇచ్చాడు ఎంపీ.  అనతి కాలంలోనే వ్యాపారంలో అగ్రస్థానంలో నిలిచిన ఆ పార్లమెంటు సభ్యుడు కుమారుడ్ని కిడ్నాప్ చేస్తే  ఇంకేముంది మనం అడిగిందంతా ఇస్తారు ఇక మన సినిమా మారిపోతుందనుకున్నాడు కిడ్నాపర్ హేమంత్. కానీ చివరికి డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వచ్చింది. 
  
ఎంపీ కుమారుడు .. విడిగా ఉంటున్నారని తెలుసుకున్న హేమంత్..  ఆలస్యం చేయకుండా గత కొద్ది రోజులుగా ఎంపీ కుమారుడు  నివసిస్తున్న ప్రాంతంలో రెక్కీ నిర్వహించాడు.  ఆ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడన్న విషయాన్ని తెలుసు కున్న కిడ్నాపర్ ముందుగా ఎంపీ కొడుకు  కిడ్నాప్ చేసేందుకు సిద్ధం అయిపోయాడు ఈ కిడ్నాప్ లో పోలీసుల ఊహకందని విధంగా ఎవరినైతే కిడ్నాప్ చేశారా వారింట్లో పై 48 గంటలు కిడ్నాపర్ వాళ్లతో  పాటు ఉన్నాడు.  నిత్యం పర్యాటకులు అదే రోడ్లో తిరిగే అందమైన సముద్రానికి అతి దగ్గరలో ఎంపీ కుమారుడు శరత్ ఇల్లు ఉంది.  ఇంట్లో శరత్ ఒక్కడే ఉన్నాడని గ్రహించిన కిడ్నా పర్లు మంగళవారం ఉదయమే ఆ ఇంట్లోకి ప్రవేశించారు.  శరత్ ని తన  ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఫోన్లలో ఇతరులకు అందుబాటులో ఉండేలా చూశారు.  ఒక్కడినే కిడ్నాప్ చేస్తే  మనము డిమాండ్ చేసిన డబ్బు ఎంపీ ఇవ్వడేమో అనే అనుమానం తో ఎంపీ భార్య జ్యోతిని కూడా కిడ్నాప్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశాడు.  ఎంతో చాకచక్యంగా కొడుకుతోనే తల్లిని అదే ఇంట్లోకి పిలిపించుకున్నాడు.  తల్లి జ్యోతి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆమెను కూడా నిర్బంధించారు. 


ఆమెకి వస్తున్న ఫోన్లు కూడా మాట్లాడించే అవకాశాన్ని కల్పించారు ఎ వరికీ అనుమానం రాకుండా గత రెండు రోజులుగా ఎప్పుడు మాదిరిగానే ఎంపీ ఎంవీవి సత్యనారాయణ కొడుకు శరత్, భార్య  జ్యోతి తో ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు . అయితే బుధవారం జీవికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎంపీ సత్యనారాయణకు అనుమానం వచ్చింది.  కనీసం తర్వాత అయినా రిప్లై ఇస్తారు కదా ఇవ్వలేదు ఏంటి అని ఆలోచనలో పడ్డ ఎంవివి సత్య నారాయణ అదే తడువుగా పోలీసు లకు ఫిర్యాదు చేశారు.  ఎంపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు జీవి ఫోన్ ట్రాక్ చేశారు అప్పటికే భీమిలి మండలంలో ఉన్నట్లు కనుక్కున్నారు.  ఇక సిపి త్రివిక్రవర్మ ఆదేశాలతో ముగ్గురు డిసిపిలు 15 టీములుగా విశాఖలో జల్లెడ పట్టారు.  వారు పయనిస్తున్న కారును వెంబడించి ఛేజ్ చేసి పట్టుకున్నారు. ఎంవివి భార్య కొడుకును జీవిని సురక్షితంగా విశాఖ తీసు కొచ్చారు . వీరితో పాటు నిందితులను కూడా  విశాఖ కమిషనరేట్ కు తరలించారు .  కిడ్నాపర్లు ఎంవివి సత్యనారాయణ కుమారుడు శరత్ కు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు పై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.


విశాఖలో ఎంవివి సత్యనారాయణ లేకపోవడం చూసి కిడ్నాపర్లు ఈ కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలుస్తోంది.  హైదరాబాదులో ఉన్నటువంటి ఎంవివి సత్యనారాయణ తనకు ఎవరితో ఎటువంటి విభేదాలు లేవని కేవలం డబ్బు కోసమే కిడ్నాపర్లు మా కుటుంబాన్ని టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు.  ఎంవివి సత్యనారాయణ అయితే కిడ్నాపర్ పై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని జైలుకు వెళ్లి వచ్చినా తన తీరు మారలేదని పోలీసులు అంటున్నారు.   విశాఖలో ఈ కిడ్నాప్ కలకలం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే పోలీసులు కొద్ది గంటల్లోనే కిడ్నాపర్ను  ఛేదించి పట్టు కోవడంతో తమ కుటుంబ సభ్యు లకు ఎటువంటి ప్రాణహాని లేక పోవడంతో ఎంవివి, జీవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.