విజయవాడ పార్లమెంట్ పరిధిలోనే కాకుండా యావత్ రాష్ట్రంలోనే కేశినేని నాని హాట్‌టాపిక్ అవుతున్నారు ఏదో కాంట్రవర్సీతో మీడియాలో ఆయన పేరు మారుమోగుతోంది. బుధవారం రోజున ఆయన చేసిన కామెంట్స్ మరింత వైరల్‌గా మారాయి. దీనిపై అటు వైసీపీ, టీడీపీ రెండూ సైలెంట్‌గానే ఉన్నాయి. అయితే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ మాత్రం సీరియస్‌గా స్పందిచారు. 
 
ట్విట్టర్ వేదికగా విజయవాడ ఎంపీ కేశినేని నానిపై పీవీపీ ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే... కేశినేని నానీ నీ బిల్డప్ ఏందయ్యా... నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు....ప్రజాసేవ కోసం పుట్టానంటావు అని మండిపడ్డారు. 






అంతే కాదు నాని బ్యాంకులను మోసాలు చేస్తూ కార్మికుల జీతాలను ఎగ్గొట్టారని కూడా ఆరోపణలు చేశారు పీవీపీ. ట్విట్టర్‌లో ఏముందంటే... బ్యాంకులని దోచి, కార్మికుల జీతాలను ఎగ్గొట్టావు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి కొట్టావని ఆరోపించారు. 


అక్కడితో ఆగిపోలేదు పీవీపీ. వెదవ సోది ఆపి, కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు అని సలహా ఇచ్చారు. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువుగాని అని ఎద్దేవా చేశారు. తనను విమర్శించే వారిపై సెటైరిక్‌గా పంచ్‌లు వేసే నాని ఈసారి పీవీపీపై ఎలా విరుచుకుపడతారో అనే ఆసక్తి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో కనిపిస్తోంది.