Chalo VijayaWada Live : పోలీసుల ఆంక్షలు ఛేదించి విజయవాడ చేరుకున్న ఉద్యోగులు

ఉద్యోగుల సమ్మెపై మరిన్ని అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ రిఫ్రెష్‌ చేయండి.

ABP Desam Last Updated: 03 Feb 2022 01:25 PM

Background

ఆంధ్రప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి నిర్వహించాలనుకున్న " చలో విజయవాడ" ర్యాలీకి ప్రభుత్వం నుంచి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. మంగళవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో  "చలో విజయవాడ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని   ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయితే చలో...More

అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్నారు ఉద్యోగులు

విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు.
పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్నారు ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు ఉద్యోగులు. ఎన్జీవో భవన్‌ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్నారు ఉద్యోగులు.
బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల్లోనూ పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చారు వేలమంది ఉద్యోగులు. పీఆర్సీ జీవో రద్దుచేయాలని నినాదాలు చేస్తున్నారు. అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్నారు ఉద్యోగులు.