= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్నారు ఉద్యోగులు విజయవాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల నినాదాలు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వచ్చారు ఉద్యోగులు, ఉపాధ్యాయులు.
పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని విజయవాడ చేరుకున్నారు ఉద్యోగులు. హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు ఉద్యోగులు. ఎన్జీవో భవన్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగుతున్నారు ఉద్యోగులు.
బీఆర్టీఎస్ రోడ్డు వైపు నినాదాలతో ముందుకు సాగుతున్నారు. జిల్లాల్లోనూ పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసు ఆంక్షలు ఛేదించుకుని విజయవాడ వచ్చారు వేలమంది ఉద్యోగులు. పీఆర్సీ జీవో రద్దుచేయాలని నినాదాలు చేస్తున్నారు. అణచివేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుందంటున్నారు ఉద్యోగులు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పోలీసుల ఆంక్షలు ఛేదించి విజయవాడ చేరుకున్న ఉద్యోగులు ఉద్యోగులు అనుకున్నది సాధించారు. విజయవాడలో సభ పెట్టాలనుకున్నారు పెట్టారు. అనుకున్నట్టుగానే పోలీసుల నిర్బంధాలను ఛేదించుకొని విజయవాడ చేరుకున్నారు. మారువేషాల్లో వివిధ మార్గాల్లో విజయవాడ చేరుకున్నారు. దీంతో బీఆర్టీ రోడ్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శ్రీకాకుళం జిల్లాలోనూ ముందస్తు అరెస్టులు.. భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన పి ఆర్ సి ఇవ్వాలని అడగడం నేరమా, అలా అడిగేందుకు రాజధానికి బయలు దేరిన ఉద్యోగులను ఉపాధ్యాయులను ముందస్తు అరెస్టులు చేయడం ప్రభుత్వానికి తగదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కె మోహన్ రావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి విమర్శించారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో ముందుస్తు అరెస్టు చేసిన ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి ధర్నాలు రాస్తారోకోలు చేపట్టేటప్పుడు సంఘీభావం తెలిపినని నేడు అధికారంలో ఉన్నప్పుడు ముందస్తుగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి ఇ గతులు చేపడితే ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని హితవు పలికారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వానికి ఇలా అరెస్టులు చేయడం సిగ్గు చేటన్నారు. ఐ ఆర్ కంటే ఫిట్ మెంట్ తగ్గించి ఇచ్చిన ప్రభుత్వం ఇదేనని విమర్శించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులను కాశిబుగ్గ సీఐ శంకరరావు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పోలీసులకు ఉద్యోగుల ఝలక్.. విడివిడిగా విజయవాడ చేరుకున్నట్టు సమాచారం వైజాగ్ ద్వారక బస్ స్టేషన్ లో పోలీసుల పహారా. ఝలక్ ఇచ్చిన ఉద్యోగులు. విడివిడిగా బ్రేక్-ఆఫ్ జర్నీ చేస్తూ ఒక రోజు ముందే విజయవాడ చేరుకున్నట్టు సమాచారం. ద్వారకా బస్ స్టేషన్ లో విజయవాడ వెళ్లే బస్సు లో ప్రతీ ప్రయాణికుడిని చెక్ చేశారు పోలీసులు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
మరోసారి విజయవాడ సీపీతో పీఆర్సీ సాధన సమితి చర్చలు మరోసారి విజయవాడ సీపీ కాంతిరాణాతో పీఆర్సీ స్టీరింగ్ కమిటి చర్చలు జరిపింది. చర్చలకు సీపీ పిలవడంతో వెళ్ళిన పీఆర్సీ స్టీరింగ్ కమిటి.. చలో విజయవాడకు అనుమతి ఇవ్వాలని రిక్వస్ట్ చేసింది. వినతిపత్రం ఇచ్చారు. అయినా అనుమతి రాలేదు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు అరెస్టులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఆర్సీకి వ్యతిరేకంగా రాష్ట్ర పీఆర్సీ పోరాట సమితి పిలుపు మేరకు చలో విజయవాడకు బయలుదేరిన ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లో పోలీసులు అడుగడుగున తనిఖీలు చేపట్టారు.. ఈ క్రమంలో చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయులను అడ్డుకున్నారు..
బస్సులను, రైళ్లను పూర్తిగా పోలీసులు తనిఖీ చేసి అనుమానితులను విచారించారు.. తిరుపతి ఈస్ట్ పోలీసులు 30 మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకోగా, శ్రీకాళహస్తిలో పది మందిని, రేణిగుంటలో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. చిత్తూరు జిల్లా పిఆర్సి పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర పిఆర్సి సాధన సమితి పిలుపు మేరకు విజయవాడకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ప్రభుత్వ మొండి వైఖరికి నిదర్శనమన్నారు.. స్వేచ్ఛ భారతదేశంలో పోరాడే హక్కు తమకు లేదని వారు ప్రశ్నించారు.. న్యాయాన్ని అడగడానికి వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం ఎంత వరకూ సమంజసం అని ఉపాధ్యాయులు ప్రశ్నించారు.. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోక పోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురి కాక తప్పదని వారు హెచ్చరించారు..