Andhra Pradesh DGP :  డిజీపి గారూ! గత ప్రభుత్వ హయాంకి, ఇప్పటికి చట్టాలలో ఏమైనా మార్పులొచ్చినవా? అని టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీ ద్వారకా తిరుమలరావును ప్రశ్నిచారు.  ఇప్పుడు నాగార్జున యాదవ్  చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు  చేస్తే విరగ్గొట్టి అర్రెస్ట్ చేసేవాళ్లన్నారు.  మరి, అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసిపి  నేను పోలీసులు విచారణ చేసి వదిలేశారని..ఒక సారి కనుక్కోవాలన్నారు.     




అసలేం జరిగిందంటే ? 


టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును చంపుతామని మీడియా చర్చలో బహిరంగంగా హెచ్చరించాని వైసీపీకి చెందిన నాగార్జున యుదవ్ పై కేసు నమోదు అయింది. కుప్పంలో టీడీపీ నేతలు పెట్టిన ఈ కేసు కారణంగా నాగార్జున యాదవ్ కొద్ది రోజులుగా ఎవరికీ కనిపించడం లేదు. తాజాగా ఆయన బెంగళూరులో ఉన్నారని తెలుసుకున్న కుప్పం పోలీసులు  అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.   అనంతరం వివిధ అంశాలపై ఆయనను విచారించారు. నాగార్జునకు 41ఏ నోటీసులు జారీ చేసి వదిలి పెట్టారు. 


గతంలో టీడీపీ కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు


గతంలో టీడీపీ కార్యకర్తలపై పోలీసులు సోషల్ మీడియా కేసులు పెట్టి అర్థరాత్రిళ్లు అరెస్టు చేసేవారు. వారి ఫోన్లు ఇతర  వస్తువులను సీజ్ చేసేవారు. చాల మందిపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో వర్గాల మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ.. కఠినమైన సెక్షన్లు పెట్టేవారు. చివరికి కోర్టుల్లో కొన్ని కేసుల్లో రిమాండ్.. మరికొన్ని కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిచేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పటికీ.. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూండటంతో పోలీసులు ఇంకా  వైసీపీ నేతల కోసమే పనిచేస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో వర్ల రామయ్య కూడా తమ కార్యకర్తలకు ఇచ్చిన ట్రీట్‌మెంటే.. వైసీపీ నేతలకూ ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోతంది. 


టీడీపీ నేతలకు క్షమాపణలు  చెప్పిన పోలీసు  అధికారుల సంఘం నేతలు                                              


రెండు రోజుల కిందట టీడీపీ కార్యాలయంలో వర్ల రామయ్యతో సమావేశం అయిన  పోలీసు అధికారుల సంఘం నేతలు.. గతంలో తాము మీసాలు మెలేశామని, తొడలు కొట్టామని.. చంద్రబాబుపై అనుచిత భాషలో విమర్శలు చేశామని.. అవన్నీ పై అధికారుల ఒత్తిడి వల్లే చేయాల్సి వచ్చిందని ..  అందుకు క్షమాపణలు చెబుతున్నామని చెప్పుకొచ్చారు.