Tirumala SED Tickets: డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు, గ‌దుల కోటాను న‌వంబ‌రు 10న విడుదల చేయనున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో మొత్తం రూ.2.25 ల‌క్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లను ఉద‌యం 10 గంట‌ల‌కు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు, గ‌దుల కోటాను సాయంత్రం 5 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తామని తెలిపారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాల్సిందిగా కోర‌ుతున్నట్లుగా చెప్పారు.