Tirumala News: తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆర్జిత సేవలకు సంబంధించి జూలై నెల కోటా టికెట్లను ఈ నెల 18న ఉదయం విడుదల టీటీడీ విడుదల చేయనుంది. జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ సేవా టికెట్ల ఎలక్ర్టానిక్‌ డిప్‌ కోసం ఏప్రిల్‌ 20వ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీ డిప్‌లో టికెట్లు మంజూరు అవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా భక్తులు సిద్ధంగా ఉన్నారు. అలాగే, కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను ఏప్రిల్‌ 22వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. 


వర్చువల్‌ సేవా కోటా విడుదల అప్పుడే..!


వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్‌ 22న మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. వర్చువల్‌ సేవా కోటా కోసం కూడా భారీ సంఖ్యలో భక్తులు నిరీక్షిస్తున్నారు. అలాగే, జూలై నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఏప్రిల్‌ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే సమయంలో శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌లైన్‌ కోటాను ఈ నెల 23న ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. 


వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా..


వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం టీటీడీ ప్రత్యేకంగా కోటా టికెట్లను విడుదల చేస్తోంది. వీరికి జూలై నెల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కకోటాను ఏప్రిల్‌ 23న మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే సమయంలో తిరుమల, తిరుపతిలో జూలై నెల గదుల కోటాను ఏప్రిల్‌ 24 మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 27న శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, నవనీత సేవకు సంబంధించిన టోకెన్లను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ స్లాట్‌లు ప్రకారం భక్తులు టికెట్లు బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.