YSRCP Leader RK Roja | తిరుపతి: ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజాపై శాప్ ఛైర్మన్ రవినాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రీడా శాఖ మంత్రిగా రోజా చేసిన అవినీతి బయటపడుతోందని, త్వరలో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. వైసీపీ హయాంలో ఆడుదాం - ఆంధ్రా పేరుతో అప్పటి మంత్రి రోజా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని రవినాయుడు ఆరోపించారు. రోజా అవినీతిపై విచారణ జరుగుతోందని, ఆగష్టు 10వ తేదీలోగా రోజా జైలుకెళ్లడం ఖాయమన్నారు. 

రోజులు లెక్కబెట్టుకో రోజా..శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాుడుతూ.. మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ కు వారెంట్ సిద్థమవుతోంది. క్రీడాశాఖ మంత్రి వైసీపీ హయాంలో ఆమె చేసిన అవినీతిపై విచారణ జరుగుతోంది. త్వరలో ఆమె జైలుకు వెళ్తుంది. క్రీడా శాఖ మంత్రిగా రాష్ట్రంలో ఒక్క స్టేడియం అయినా రోజా నిర్మించారా..?. 

నగరికి టూరిస్ట్ రోజాఏపీలో ఎమ్మెల్యే, మంత్రిగా చేసిన రోజా నిత్యం తమిళనాడులోనే ఉంటున్నారు. ఆమె నగరికి టూరిస్టులా వచ్చి వెళ్తుంటారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పై రోజా చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి. ఆమెకు దమ్ముంటే గాలి భానుప్రకాష్ సవాల్ ను స్వీకరించాలి. మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి

చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడటమా..?'రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత, ఏపీ సీఎం చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే రోజా ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. సూపర్ సిక్స్ హామీలు, ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తున్నాం. సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 

ఏపీలో పరిస్థితి మారింది. పరిశ్రమలు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడాన్ని వైసిపి నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. గత 3 నెలలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ తన వికృత చేష్టలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైసిపి నేతలు రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇకనైనా అన్నీ మానుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని తెలుసుకుని మాట్లాడాలని’ శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు.