Zoo in Tirupati: తిరుపతిలో ఘోరం జరిగింది. నగరంలోని ఎస్వీ జూలో సింహాలు ఓ సందర్శకుడిని చంపాయి. జూకి సందర్శకుడిగా వచ్చిన ఉత్తరాది ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏసియన్ సింహాల ఎన్ క్లేవ్ లోకి దూకేసినట్లు తెలిసింది. లోపలకు దూకడంతోనే సింహాలన్నీ మూకుమ్మడిగా వ్యక్తిగా దాడి చేసి చంపేశాయి. మరణించిన వ్యక్తి జూకు ఒకడే వచ్చినట్లుగా భావిస్తున్నారు. జూ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. చనిపోయిన వ్యక్తి శవాన్ని పోలీసులు రుయా ఆస్పత్రికి తరలించారు.