Tirupati Laddu Contriversy: తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారి ఎవర్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు సాయంత్రం లోపు రిపోర్టు ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందే పూర్తి వివరణతో రిపోర్టు ఉండాలని సూచించారు.