Big Breaking: మేడ్చల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ABP Desam Last Updated: 11 Sep 2021 08:40 PM
Background
తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు ఇవాళ శ్రీకారం చుట్టునున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సమన్వయంతో ఐటీశాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది....More
తెలంగాణ ఐటీ శాఖ పరిధిలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ ఆధ్వర్యంలో మెడిసిన్ ఫ్రం స్కై ప్రాజెక్టు ఇవాళ శ్రీకారం చుట్టునున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, నీతి ఆయోగ్, హెల్త్నెట్ గ్లోబల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సమన్వయంతో ఐటీశాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఈ సంస్థల భాగస్వామ్యంతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు లేని ప్రాంతాల్లోని ప్రజలకు ఔషధాలు సరఫరా చేయనున్నారు. వికారాబాద్లో ఈ ప్రాజెక్టును నిర్వహించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. మారుట్ డ్రోన్స్, బ్లూ డార్ట్, స్కై ఎయిర్, టెక్ ఈగిల్ సంస్థలు రెండ్రోజులుగా అవసరమైన ఏర్పాట్లు, ట్రయల్ రన్స్ చేశాయి. మొదటి రోజు ట్రయల్ రన్లో 400 మీటర్ల ఎత్తు వరకు ఔషధాల బాక్సును డ్రోన్లు తీసుకెళ్లాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తిరుమలకు చేరుకున్న ఏపీ చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి దంపతులకు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, చిత్తూరు కలెక్టర్ హరి నారాయణ్, ఎస్పీ వెంకట అప్పల నాయుడులు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రి అక్కడే బస చేసి రేపు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొననున్నారు.