Breaking News:   తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 24 Aug 2021 10:38 PM

Background

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. చింతపల్లి హైవే వద్ద ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ...More

  తెలంగాణలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ

అగ్రవర్ణ పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు సంబందించిన ఉత్తర్వులు మంగళవారం జారీ చేసింది. ప్రభుత్వ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రూ. 8లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వాళ్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వర్తించని వాళ్లకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఎంఆర్ఓ ఇచ్చే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయిస్తారని, ధ్రువపత్రం తప్పని తేలితే సర్వీసు రద్దు, చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటాలో భర్తీ కాని సీట్లను తదుపరి ఏడాదికి బదిలీ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్‌ నియామకాల్లోనూ మహిళలకు 33.33 శాతం కోటా అమలు చేయనున్నారు.