= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
వైద్యుల నిర్లక్ష్యం... నిండు ప్రాణం బలి...! హనుమకొండలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ కిందపడిపోయిన జునైద్ పాషా(8) శుక్రవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వలనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నామని డబ్బులు కట్టించుకొని, చివరికి మరణించాడని డాక్టర్లు చెప్తున్నారని కుటుంబసభ్యుల ఆవేదన చెందుతున్నారు. హాస్పిటల్ ముందు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
దంతేవాడలో ఎన్ కౌంటర్.. నక్సలైట్ మృతి చత్తీస్ గడ్ దంతేవాడలో పోలీసులు, ఇంద్రావతి ఏరియా కమిటీ నక్సలైట్ల మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో ఒక నక్సలైట్ మృతి చెందాడు. గీదమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో DRG జవాన్లు, నక్సలైట్ల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మృతి చెందిన నక్సల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన నక్సలైట్ రామ్సుగా గుర్తించారు. అతనిపై 5 లక్షల రివార్డ్ ఉన్నట్టు గుర్తించారు. ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో 7.62 ఎంఎం పిస్టల్, 5 కిలోల ఐఈడీ, వైర్, రోజువారీ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి... జనాన్ని హడలెత్తించిన దున్నపోతు హైదరాబాద్ సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ దున్నపోతు హల్చల్ చేసింది. రోడ్డు మీదకు వచ్చి కనిపించిన వారిపై దాడి చేసింది. ఖైరతాబాద్ చింతల్బస్తీలో రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. ఎదురుగా కనిపించిన వారి మీద దాడి చేసింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. దున్నపోతు స్కూటీతో పాటు ఓ మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకోగలిగారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఉద్యోగం దొరకడంలేదని యాసిడ్ తాగి యువకుడు ఆత్మహత్య.! తెలంగాణ రంగారెడ్డి నార్సింగ్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నార్సింగ్ పీఎస్ పరిధి పుప్పాల్ గూడలో యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యోగం దొరకడంలేదన్న ఒత్తిడితో మహ్మద్ అజాజ్ అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మహమ్మద్ అజాజ్ హుమాయూన్ నగర్ కు చెందిన వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
తిరుపతిలో బైక్ లపైకి దూసుకెళ్లిన కొత్త కారు
తిరుపతి లీలామహల్ సర్కిల్లో కారు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. పార్క్ చేసి ఉన్న బైక్ లను ఢీకొట్టింది. శుక్రవారం కొత్త కారు కొని షోరూం నుంచి ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ప్రమాదం జరిగింది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్... 14 మంది విద్యార్థులకు అస్వస్థత అనంతపురం జిల్లా యాడికి మండలం తిప్పారెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 14 మంది విద్యార్తులకు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అస్వస్థతకు గురై విద్యార్థులు కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు తల్లితండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థులను తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. 7 మంది విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
డిగ్రీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ తెలంగాణలో రేపట్నుంచి ఈనెల 20 వరకు దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈనెల 24న ప్రత్యేక విడత డిగ్రీ సీట్ల కేటాయింపు జరగనుంది. ఇప్పటివరకు మూడు విడతల్లో 1,97,722 డిగ్రీ సీట్ల భర్తీ చేశారు. మిగిలిన 2,19,693 సీట్ల భర్తీకి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
బట్టల షోరూంలో పోకిరీలు.. ట్రయల్ రూంలో వీడియో రికార్డు? హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని హెచ్ అండ్ ఎం షోరూంలో పోకిరీలో రెచ్చిపోయారు. ఏకంగా షోరూంలోని ట్రయల్స్ రూంలో కెమెరాలు పెట్టి ఇద్దరు యువకులు రికార్డు చేస్తున్న విషయాన్ని ఇద్దరు యువతులు గుర్తించారు. వారు వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఆ ఇద్దరు యువకులు సహా షోరూం మేనేజర్ను అరెస్టు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
శివనామస్మరణతో మార్మోగిన కొవ్వూరు గోష్పాద క్షేత్రం కార్తీక మాసం మొదటి రోజు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పవిత్ర గోష్పాద క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి భక్తులు పోటేత్తుతున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
కేదార్ నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు చేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ ఆలయం నాలుగు పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. దీనిని చార్ ధామ్ అని పిలుస్తారు. ఇందులో యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్ ఆలయ పర్యటన కోసం శుక్రవారం డెహ్రాడూన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీకి ఉత్తరాఖండ్ గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. ఆలయ సందర్శన అనంతరం అక్కడే ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేదార్ నాథ్లో కొన్ని శంకుస్థాపనలు మోదీ చేయనున్నారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత సుబ్రత ముఖర్జీ కన్నుమూత పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్రత ముఖర్జీ(75) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముఖర్జీ కోల్కతాలోని ఎస్ఎస్కేఎమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీనియర్ నేత మృతి పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అనంతపురం జిల్లాలో మరో ప్రమాదం.. ఇద్దరు మృతి అనంతపురం జిల్లాలో పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నవారిని ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. వీరిని యాకుబ్ అనే 62 ఏళ్ల వ్యక్తి, నారాయణ అనే 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
అనంతపురంలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం అనంతపురం జిల్లా పామిడిలోని 44వ నెంబరు హైవేపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. వీరిది గార్లదిన్నె మండలం కొల్లపగొండ ప్రాంతంగా గుర్తించారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరంతా పెద్ద వడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి కోతకు వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జు నుజ్జు కాగా శరీరాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.