Breaking News Live: టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 23న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ABP Desam Last Updated: 23 Oct 2021 10:07 PM
Background
పోడు భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడు భూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అడవుల పరిరక్షణ, హరితహారంపైనా సమావేశంలో చర్చ జరుగుతుంది.తెలంగాణలో...More
పోడు భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరుగుతుంది. కలెక్టర్లు, అటవీ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సీఎం భేటీ అయ్యారు. పోడు భూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు. అడవుల పరిరక్షణ, హరితహారంపైనా సమావేశంలో చర్చ జరుగుతుంది.తెలంగాణలో పలు చోట్ల భూమి కంపించింది. మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లో పలు చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2:03 ప్రాంతంలో మంచిర్యాల జిల్లాలోని రాంనగర్, గోసేన మండల్ కాలనీ, నస్పూర్లలో భూమి కంపించించినట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.వారం రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు (శనివారం) అతి స్వల్పంగా తగ్గాయి. భారత్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,460గా కొనసాగుతోంది. మూడు రోజులుగా భారీగా పెరిగిన వెండి భారత్ మార్కెట్లో ఈ రోజులు రూ.400 తగ్గింది ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఉపాధిహామీ పనులపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మెటీరియల్ కాంపొనెంట్ వినియోగంపై దృష్టి పెట్టాలన్నారు. కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల గ్రామ సచివాలయాల నిర్మాణాల్లో వేగం పెంచాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి భవనాలను కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఈ పనులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. 2020 ఖరీఫ్కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు కార్యక్రమాలు ఉంటాయని సీఎం అన్నారు. నవంబర్లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాజకీయ పని మీద దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయనకు సోమవారం రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారయింది. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను ఆయన రాష్ట్రపతికి వివరించి.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు. అయితే చంద్రబాబు పర్యటన అంతటితో ఆగిపోయే అవకాశం లేదు. ప్రముఖ నేతలను కలుస్తారు. పాత రాజకీయ మిత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూత
కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు మృతిచెందారు. విజయవాడ లబ్బిపేటలోని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. కాట్రగడ్డ బాబు మృతి పట్ల పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు.