Dokka Varaprasad Sensational Comments: తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మాజీ మంత్రి, టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ (Dokka Manikya Varaprasad) సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అన్నారు. ప్రజా ప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. దీని ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన ట్యాపింగ్‌పై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, ఇతర ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు రావడంతో దీనిపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. 


Also Read: Telangana Election Results : టెస్ట్ పాసైన రేవంత్ రెడ్డి - ఇక ఐదేళ్లూ ప్రభుత్వానికి ఢోకా లేనట్లే !