Bagmati Express Collided With Freight Train In Chennai:  చెన్నై: గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) (Bagmati Express) రైలు ఢీకొట్టిన ఘటన వల్ల పలు రైళ్లు దారి మళ్లించగా, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రద్దు చేసినట్లు ప్రకటించింది.  డా ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు,, తిరుపతి- పుదుచ్చేరి మెము, డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- తిరుపతి మెము, అరక్కోణం- పుదుచ్చేరి మెము, విజయవాడ-డా.ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ పినాకిని ఎక్స్‌ప్రెస్‌, సూళ్లూరుపేట-నెల్లూరు మెము ఎక్స్‌ప్రెస్‌, తిరుపతి-అరక్కోణం మెము, తిరుపతి- డా. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ మెము, అరక్కోణం- తిరుపతి మెము ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేసిట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ప్రమాదంతో చెన్నై సెంట్రల్ నుంచి ఢిల్లీకి వెళ్లే తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌, నెల్లూరు - చెన్నై మధ్య రైళ్ల రాకపోకలు సైతం నిలిచిపోయాయి.


సికింద్రాబాద్ - దనపూర్ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 10.55 గంటలకు బయలుదేరనుంది. షెడ్యూల్ ప్రకారం 9.25 గంటలకు బయలుదేరాల్సి ఉన్న ట్రెయిన్ నెం 12791 ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


విజయవాడ డివిజన్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు
గూడురు: 08624 250795
ఒంగోలు: 08592 280306
విజయవాడ: 0866 2571244
నెల్లూరు: 0861 2345863
ఏలూరు: 7569305268
తాడేపల్లిగూడెం: 8818226162


అసలేం జరిగింది..


తమిళనాడులోని చెన్నై శివారులో శుక్రవారం రాత్రి రెండు రైళ్లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును మైసూర్ - దర్భంగా మధ్య నడిచే (Bagumathi Express) భాగమతి ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొన్ని బోగీలు ధ్వంసం కాగా, ఎక్స్ ప్రెస్ రైలులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి.






మైసూర్ - దర్బంగా భాగమతి ఎక్స్ ప్రెస్ రైలుకు శుక్రవారం రాత్రి 8:27 గంటల సమయంలో పొన్నేరి స్టేషన్ దాటిన తర్వాత కావరైపెట్టై స్టేషన్‌లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భాగమతి రైలు రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తుండగా భారీ కుదుపు ఏర్పడినట్లు రైలు సిబ్బంది గుర్తించారు. మెయిన్ లైన్‌లో వెళ్లాల్సిన భాగమతి రైలు, లూప్ లైన్‌లోకి వెళ్లడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 భోగీల్లో మంటలు వచ్చాయి. కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు వెంటనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. చెన్నై రైల్వే డివిజన్ అధికారులు 04425354151, 04424354995 నెంబర్లలో సంప్రదించాలని ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు.