Annavaram Video Viral: కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, అన్నవరం సత్యదేవుని ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. ఆ పవిత్రమైన ప్రసాదం పట్ల అధికారులు, సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూపే హృదయ విదారక దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అన్నవరం-వైజాగ్ హైవే మార్గంలోని ప్రసాదం విక్రయ కేంద్రాల్లో రాత్రి 11 గంటల సమయంలో బుట్టల్లో నిల్వ ఉంచిన ప్రసాదంపై ఎలుకలు గుంపులు గుంపులుగా దాడి చేస్తున్న విషయాన్ని ఒక భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Continues below advertisement

నిర్లక్ష్యం నీడలో పవిత్ర ప్రసాదం 

బుట్టల్లో ఉన్న ప్రసాదంపై ఎలుకలు స్వైరవిహారం చేస్తుంటే, అక్కడ ఉన్న సిబ్బందిని ప్రశ్నించిన భక్తులకు ఎదురైన సమాధానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉందని. "అవును.. ఇలాగే ఉంటాయి, ఇష్టమైతే కొనుక్కోండి.. లేకపోతే పొండి" అని సిబ్బంది సమాధానం చెప్పారు. సిబ్బంది అహంకారానికి, భక్తి పట్ల వారికున్న చులకన భావానికి నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు. ఇలాంటి ఉద్యోగుల వల్ల సనాతన ధర్మం అపహాస్యం అవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement