PM Modi announced ex-gratia Rs2 lakh

విజయనగరం: ఏపీలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం అలమండ- కంటకాపల్లి వద్ద రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ కనీసం ఏడుగురు చనిపోగా, మరో 50 మంది వరకు గాయపడ్డారని సమాచారం. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షల మేర నష్టపరిహారం ప్రధాని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి సైతం రూ.50 వేలు చికిత్స కోసం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు.

రైలు ప్రమాదం గురించి తెలియగానే ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రమాదం వివరాలపై కేంద్ర మంత్రిని ఆరా తీశారని పీఎంఓ తెలిపింది. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బాధితులకు సాధ్యమైనంత మేరకు సహాయ సహకారాలు అధికారులు అందిస్తున్నారని చెప్పారు. మరోవైపు, రైలు ప్రమాదం దుర్ఘటనపై కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్‌.. ఏపీ సీఎం జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాద తీవ్రత, ప్రాణ నష్టంతో పాటు బాధితులకు వైద్య చికిత్స లాంటి వివరాలను రైల్వే మంత్రి వైష్ణవ్‌ ఆరా తీసినట్లు సమాచారం.

రైలు ప్రమాదం మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించనున్నారు. 

రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.

రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే0891 2746330, 08912744619ఎయిర్ టెల్81060 530518106053052బీఎస్ ఎన్ ఎల్ 85000416708500041671

విశాఖలో హెల్ప్ లైన్ నెంబర్లు ఇవీ.. విశాఖపట్టణం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి, చినరావుపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఈ రైలు ప్రమాదం ఘటనలో బాధితుల వైద్య సహాయార్థం విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నంబర్స్ ను జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున ఏర్పాటు చేశారు. విశాఖ కేజీహెచ్ లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవే..1. కేజీహెచ్ casuality No.89125584942. Doctor at కేజీహెచ్ మొబైల్ No. 8341483151 (24 hrs available)3. Doctor at కేజీహెచ్ casuality మొబైల్ No.8688321986 (24 hrs available)