Terrorist movements : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డీజీపీతో పాటు చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని లేఖలో తెలిపారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి. రోహింగ్యాలు, ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. దేశ భద్రత, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.