నేషనల్ డెమోక్రటిక్ అలియాన్స్ (ఎన్డీఏ) సమావేశంలో పాల్గొనడం కోసం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోమవారం (జూలై 17) ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం (జూలై 18) నాడు నిర్వహించే ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. నేడు ఢిల్లీ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ కేంద్ర మంత్రులు కూడా వ్యక్తిగతంగా తనకు ఫోన్ చేసి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చర్చ ఉంటుందని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.