Tdp On Minister Roja : తిరుమలలో రాజకీయాలేంటి రోజక్కా, ఆనం వెంకట రమణా రెడ్డి సెటైర్లు

ABP Desam Updated at: 11 Jun 2022 03:09 PM (IST)
Edited By: Satyaprasad Bandaru

Tdp On Minister Roja : తిరుమలలో దైవ దర్శనానికి వచ్చిన రాజకీయాలు మాట్లాడడం సరికాదని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. మంత్రి రోజా వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

ఆనం వెంకట రమణా రెడ్డి , టీడీపీ నేత

NEXT PREV

Tdp On Minister Roja : తిరుమలలో దైవ దర్శనానికి వచ్చిన రోజా రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి. బీఏ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన రోజా నారా లోకేశ్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారాయన. లోకేశ్ ఏం చదువుకున్నారు విదేశాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశారో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. మీ నాయకుడు జగన్  ఏం చదివాడో సర్టిఫికెట్ ఉంటే చూపించండి అని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన విజయసాయి రెడ్డి  వయసుకు తగ్గట్టు మాట్లాడాలని హితవుపలికారు.  విజయసాయి రెడ్డి సర్వేపల్లిలోని తన సొంత ఊరును ఇప్పటి వరకు అభివృద్ధి చెయ్యలేకపోయారని విమర్శించారు.


తిరుమలలో రాజకీయాలా?  



శనివారం, ఆదివారం ప్రొటోకాల్ దర్శనాలు లేవని టీటీడీ చెప్పింది. భక్తులు పెద్ద సంఖ్యలు వస్తారు ఈ రోజుల్లో. కానీ వారానికి మూడు రోజులు మంత్రి రోజా తిరుపతికి వెళ్తుంది. టీటీడీ ప్రొటోకాల్ దర్శనాలు లేవని చెప్పి మంత్రి రోజాకు ఎలా దర్శనానికి అనుమతించారు. పోనీ దర్శనం చేసుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడతారు. దేవుని దర్శనానికి వెళ్లి ఏంటమ్మ రాజకీయాలు. తిరుమలలో ఏ పార్టీ వాళ్లు రాజకీయాలు మాట్లాడిన అది తప్పు. రోజక్క ఒకటి మాత్రం నిజం చెప్పింది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన సూపర్ అన్నారు. నిజమే ప్రజలు తమిరి కొడుతున్నారు ఆ స్పందన మామూలుగా లేదు. విజయసాయి రెడ్డి నువ్వు పుట్టిన ఊరుకి వెళితే అక్కడి ప్రజలు నిన్ను తరిమి కొడతారు. - -ఆనం వెంకట రమణా రెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి 


మంత్రి రోజా కామెంట్స్ 


తిరుమల శ్రీవారిని శనివారం మంత్రి రోజా దర్శించుకున్నారు. తిరుమల ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు రోజా విమర్శించారు. తెలంగాణలోలాగా ఏపీలోనూ టీడీపీ మూతపడుతోందన్నారు. వైసీపీలో కష్టపడిన వారంతా ప్రజా ప్రతినిధులు అయ్యారన్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తుంటే హారతి పట్టి స్వాగతం పలుకుతున్నారన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలకు కోత పెట్టకుండా ప్రజలకు ఫలాలు అందిస్తున్నా్రన్నారు. అర్హత ఉన్నవారికి కచ్చితంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి రోజా తెలిపారు. సీఎం జగన్ పాలనకు వస్తున్న ప్రజాధారణ చూసి చంద్రబాబు, లోకేశ్ కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.

Published at: 11 Jun 2022 03:05 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.