Breaking News Telugu Live Updates:  వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 08 Oct 2022 07:01 PM
 వనపర్తి జిల్లా ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతు 

వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఊక చెట్టు వాగులో ముగ్గురు గల్లంతయ్యారు. కొద్దిరోజులుగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు సరళాసాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫాన్ వ్యవస్థ ఆన్ కావడంతో ప్రాజెక్టు వెనకాల ఉన్న వనపర్తి ఆత్మకూరు రోడ్డుపై ఊక చెట్టు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగును దాటే క్రమంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో ఇద్దరు ఆడవాళ్లు ఒక యువకుడు ఉన్నారు. గల్లంతైన వారికోసం మదనాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  

హైదరాబాద్ లో కుండపోత వర్షం, రోడ్లన్నీ జలమయం 

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. శనివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.  

అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారు - స్వరూపానందేంద్ర

దేవాదాయ శాఖ తీరుపై మండిపడ్డ విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర


అంతర్గత కలహాలతో అధికారులు దేవాదాయ శాఖను బ్రష్టు పట్టిస్తున్నారు
-స్వరూపానందేంద్ర


వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడుతున్నారు
-స్వరూపానందేంద్ర


పెరుగుతున్న భూవివాదాలు, భూ కబ్జాల దృష్ట్యా దేవాదాయశాఖలో రెవెన్యూ ఉద్యోగుల సేవలు అవసరమే
-స్వరూపానందేంద్ర


అలాగని దేవాదాయశాఖ ఉద్యోగస్తులను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదు
-స్వరూపానందేంద్ర


దేవాదాయ శాఖలో అధికారుల సంఖ్య తక్కువగా ఉంది
-స్వరూపానందేంద్ర


12 ఏళ్ళుగా దేవాదాయ శాఖలో ప్రమోషన్లకు నోచుకోకపోవడం శోచనీయం
-స్వరూపానందేంద్ర


కోర్టు వ్యాజ్యాలను పక్కనపెట్టి ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి రావాలి
-స్వరూపానందేంద్ర


అలా వస్తే ప్రభుత్వంతో మాట్లాడి పదోన్నతులు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా
-స్వరూపానందేంద్ర


సింహాచలంలో దేవాదాయ శాఖ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి

చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు భేటీ

చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు భేటీ అయ్యారు. గాడ్‌ ఫాదర్‌ మంచి విజయాన్ని అందుకున్నందుకే మెగాస్టార్‌ను అభినందించడానికే సమావేశమయ్యారని గంటా అనుచరులు చెబుతున్నారు. కానీ తాజా రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలోనే పవన్‌కు సపోర్ట్‌గా చిరంజీవి మాట్లాడారు. అవసరమైతే తాను కూడా పవన్‌కు మద్దతుగా నిలబడతానన్నారు. ఈ కాక ఇంకా చల్లారక ముందే చిరంజీవి, గంటా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ తరఫున 2019 ఎన్నికల్లో గెలిచిన గంటా శ్రీనివాస రావు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య స్టీల్‌ప్లాంట్ ఉద్యమం పాల్గొన్న ఆయన.. తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా కూడా సమర్పించారు. అప్పటి నుంచి శాసన సభకు కూడా వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో వికేంద్రీకరణ, అమరావతి ఉద్యమంపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్నా గంటా మాత్రం రియాక్ట్ కాలేదు. టీడీపీలో అంత యాక్టివ్‌గా లేని గంటా ఇప్పుడు చిరంజీవితో సమావేశం కావడం రాజకీయంగా చర్చ మొదలైంది.

గెలవలేరనే రాజీనామాలంటూ కొత్త డ్రామాలు: నక్కా ఆనందబాబు

వికేంద్రీకరణ సమావేశాలు జగన్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్టులతో నడిపించేవేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. మళ్లీ గెలవలేమని తెలిసే వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామాలంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని దుయ్యబట్టారు. సిఎం దుర్మార్గపు ఆలోచనలు అమలు చేయడానికి మంత్రులంతా మద్దతు పలకటం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్​లో ఉండగా జగన్ రెడ్డిని ధర్మాన, బొత్స తిట్టినట్లు మరెవ్వరూ తిట్టలేదని గుర్తుచేశారు. విశాఖను జేగ్యాంగ్ దోపిడీకి అడ్డాగా మార్చుకుని ప్రజల్ని మభ్యపెట్టేయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించిన బిజెపి. ఇదివరకే కాంగ్రెస్, టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కొన్ని రోజుల కిందట పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మునుగోడు ఉప ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్ వచ్చిన తరుణంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఛాన్స్ ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీజేపీ సైతం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది.

జేఏసీ కన్వినర్ కు రాజీనామా లేఖ అందజేసిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

నాన్ పొలిటికల్ జె.ఏ.సీ. ఆవిర్భావ వేదికపై ఎమ్మెల్యే ధర్మశ్రీ కీలక వ్యాఖ్యలు....


విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే  ముమ్మాటికీ అమరావతికి మేము వ్యతిరేకమే...


దమ్ముంటే రాజీనామాకు అచ్చెన్నాయుడు సిద్ధ పడాలి..


స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు నేను సిద్ధం...


జె.ఏ.సీ.కన్వీనర్ కు రాజీనామా లేఖను అందజేసిన ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ....


ఎగ్జిక్యూటివ్ కెపిటల్ కు అనుకూలంగా నేను చోడవరంలోను...వ్యతిరేకిస్తూ టెక్కలిలో అచ్చన్నాయుడు పోటీకి సిద్ధం అవ్వాలి....


కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించే నాయకులను రాజకీయాల నుంచి వెలివేయాలి


వారం రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లో విస్త్రతంగా సమావేశాలు, ర్యాలీలు..


ఈనెల 15న భారీ నిరసన ప్రదర్శన....

AP Captail Issue: ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం- ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

విశాఖ: రాజధాని సాధన కోసం అవసరం అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధం- ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్


ఉమ్మడి కార్యాచరణ ప్రకటించిన నాన్ పొలిటికల్ జె.ఏ.సీ...


భారీ నిరసన ప్రదర్శన ద్వారా రాజధాని ఆకాంక్షను ప్రజలకు చెబుతాం....


వారం రోజులు పాటు నిరంతరంగా జె.ఏ.సి. ఆధ్వర్యంలో కార్యక్రమలు జరగాలి....


విశాఖ రాజధానిపై జరుగుతున్న విష ప్రచారాలు తిప్పికొట్టాలి-


భీమిలి ఎమ్మెల్యే అవంతి


జాయింట్ యాక్షన్ కమిటీకి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళిక...


వికేంద్రీకరణకు ఉద్యమం ఉప్పెనలా ఉండాలి....


 అక్టోబర్ 15న విశాఖలో భారీ నిరసన ప్రదర్శన....


అంబెడ్కర్ సర్కిల్ నుంచి వేలాది మంది తో కొనసాగించాలి....


అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే ముందే నిరసన ప్రదర్శనలు హోరెత్తాలి...


మంత్రి గుడివాడ అమర్నాథ్

బస్సులో చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం

బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. 14 మంది సజీవదహనం


మహారాష్ట్రలోని నాసిక్​లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. 


శనివారం తెల్లవారు జామున 4.20 గంటల సమయంలో నాసిక్​-ఔరంగాబాద్​ రహదారిపై హోటల్​ చిల్లీ చౌక్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. 


మంటల్లో చిక్కుకుని 14 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు. 


అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నాసిక్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Background

తిరుపతి : తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శుక్రవారం 07-10-2022 రోజున 70,007 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 42,866 మంది తలనీలాలు సమర్పించగా, 4.25 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి బయట గోగర్భం డ్యాం వరకూ భక్తులు క్యూలైన్స్ లో వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు దాదాపు 50 గంటలకు పైగా సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.. 


త్వరలో ఈశాన్య రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలలో చివరిసారిగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే అక్టోబర్ 9 నుంచి మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు తగ్గుముఖం పట్టినా, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, యానాంలో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
 
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై మరో రెండు రోజుల్లో పూర్తిగా తగ్గనుంది. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అక్టోబర్ 9 వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. శుక్రవారం సైతం పలు జిల్లాల్లో చిరు జల్లులు, మోస్తరు వర్షాలు కురిశాయి. గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి
అక్టోబర్ 8న వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో  అక్కడ్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభాంతో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు పడతాయి. కోస్తాంధ్ర​, ఉత్తరాంధ్ర జిల్లాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. తీరంలో 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో నైరుతి, తూర్పు బంగాళాఖాతం దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లడం క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
అల్పపీడనం బంగాళాఖాతంలో నుంచి తేమను కోస్తాంధ్రలోని ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాల్లోకి వస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం మరింత బలపడటంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. సాయంకాలం సమయంలో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అనుకూలంగా ఉంది. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లోని అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.