Minister Nara Lokesh Solved Employees Problems: మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చొరవతో డిగ్రీ కళాశాల సిబ్బందికి నియామక ఉత్తర్వులు అందాయి. 23 నెలలుగా తమకు అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు అందలేదని మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రజా దర్భార్‌లో మంత్రి లోకేశ్‌కు తమ పరిస్థితిని వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్‌కు సమస్య పరిష్కరించాలని సూచించారు. ఆయన ఆదేశాలతో ప్రిన్సిపాల్ వెను వెంటనే 32 మందికి నియామక పత్రాలు అందజేశారు. 'కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని గత వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది. 23 నెలలుగా న్యాయబద్ధంగా వారికి అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా మానసిక వేదనకు గురి చేసింది. ప్రజాదర్భార్‌లో నా దృష్టికి ఈ విషయం రాగా అధికారులకు తగు ఆదేశాలిచ్చి పరిష్కరించా.' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల ఒక్క వాట్సాప్ మెసేజ్‌‍తో సర్టిఫికెట్ సమస్యను పరిష్కరించి.. అందుకు తగిన జీవో కూడా వెను వెంటనే ఇచ్చి 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఎన్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించిన విషయం తెలిసిందే.






మెయిల్ చేస్తే..


కాగా, మంత్రి లోకేశ్‌ వాట్సాప్ సాంకేతిక కారణాలతో ఇటీవల బ్లాక్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో తనను వచ్చి కలవాల్సిన అవసరం లేదని లోకేశ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పూర్తి వివరాలతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి పంపించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ లోకేశ్ వాట్సాప్‌కు మెసేజ్‌లు పోటెత్తడంతో ఆయన వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆయన ప్రత్యామ్నాయంగా మెయిల్ ఐడీని ఇచ్చారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని అన్నారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య - సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతిలో పొందుపరచాలని సూచించారు.


Also Read: Andhra Pradesh IPS Transfers : ఏపీలో మరోసారి భారీగా ఐపీఎస్‌ల బదిలీలు - పలువురు ఎస్పీలకు స్థానచలనం