Breaking News Live: శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ABP Desam Last Updated: 19 Feb 2022 09:32 AM
Background
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒకట్రెండు చోట్ల మాత్రమే 20 కంటే తక్కువ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది....More
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కుతోంది. గత కొన్ని రోజులుగా 15 డిగ్రీలుగా నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఒకట్రెండు చోట్ల మాత్రమే 20 కంటే తక్కువ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది.ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం (Daily weather report of Andhra Pradesh)లో ఏ మార్పులు లేవు. వాతావరణం మరింత వేడెక్కుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రలు గత రెండు రోజుల నుంచి విపరీతంగా పెరుగుతుండటంతో పగటి వేళ కొన్నిచోట్ల ఉక్కపోత అనిపిస్తుంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 18.6 డిగ్రీలు, బాపట్లలో 19.1 డిగ్రీలు, అమరావతిలో 19.5 డిగ్రీలు, విశాఖపట్నంలో 19.8 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు.రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. ఆరోగ్యవరం లాంటి ప్రాంతాల్లో ఇంకా కనిష్ట ఉష్ణోగ్రతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఆరోగ్యవరంలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు నమోదైంది. నంద్యాలలో 18.8 డిగ్రీలు, తిరుపతిలో 20 డిగ్రీలు, కర్నూలులో 20.9 డిగ్రీలు, అనంతపురంలో 20 డిగ్రీలు, కడపలో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హీటెక్కుతోన్న తెలంగాణతెలంగాణలో ఆకాశం పాక్షింగా మేఘాలతో ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురిశాయి. అయినా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.బంగారం, వెండి ధరలుతెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు బాగా పెరిగింది. గ్రాముకు రూ.50 చొప్పున పెరిగింది. వెండి ధర కూడా కిలోకు రూ.600 పెరిగింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో రూ.46,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.50,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలోకు రూ.68,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.ఇక విశాఖపట్నం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,510గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.68,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.46,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.50,510గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,600గా ఉంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Sajjala: కర్నూలులో రోడ్డు ప్రమాదం సజ్జలకు తప్పిన ముప్పు
ప్రభుత్వ సలహాదారు,వైసీపీ నేత సజ్జల రామ కృష్ణ రెడ్డికి ప్రమాదం తప్పింది. సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఫ్లైఓవర్ పై కాన్వాయ్ వెళుతుండగా వాహనములు అదుపుతప్పి ఒకదానికొకటి ఢీ కొట్టాయి. వైసీపీ నేత పత్తికొండ మురళీధర్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన వస్తుండగా ప్రమాదం. కర్నూలు స్టేట్ గెస్ట్ హౌస్ చేరుకునే మార్గమధ్యంలో స్వల్ప ప్రమాదం. దెబ్బతిన్న వాహనాలు. సురక్షితంగా గెస్ట్ హౌస్ కి చేరుకున్న సజ్జల.