కర్నూలు బస్సు ప్రమాదంలో ఇద్దరు సాప్ట్‌వేర్ ఇంజినీర్లు సజీవ దహనం

Bus Fire Accident in Kurnool: కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ దగ్ధమైన ఘటనలో 20 మంది సజీవ దహనం కాగా, కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Shankar Dukanam Last Updated: 24 Oct 2025 06:51 PM

Background

కర్నూలు: కర్నూలు జిల్లాలో ఓ బస్సు మంటలు చెలరేగి దగ్ధమైంది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మందికి పైగా మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 12 మంది గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 40 మంది వరకు ఉన్నట్లు...More

కర్నూలు బస్సు ప్రమాదంలో రావులపాలెం వ్యక్తి మృతి.

కర్నూలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం చెందిన యువకుడు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి (39) దుర్మరణం పాలయ్యాడు. శ్రీనివాసరెడ్డి క్రేన్ ఆపరేటర్‌గా జీవనం సాగిస్తుంటారు. రెండు రోజుల క్రితం పని నిమిత్తం హైదరాబాద్‌కి వెళ్లి, అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు బయలుదేరగా దారిలో కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుడు భార్య లక్ష్మీ జ్యోతి గృహిణి. కుమారుడు వెంకటరెడ్డి (ఎనిమిదవ తరగతి), కుమార్తె దివ్య (మూడో తరగతి) ఉన్నారు

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.