KRMB GRMB Meet: కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... భేటీలో కీలక అంశాలపై చర్చ

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి సమావేశం ఇవాళ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరగనుంది.

ABP DesamLast Updated: 09 Aug 2021 12:34 PM

Background

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు ఉమ్మడి సమావేశం హైదరాబాద్ లోని జలసౌధలో  నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది.  ఉమ్మడి సమావేశంలో కేంద్రం జలశక్తి మంత్రిత్వశాఖ విడుదల...More

నెలలో గెజిట్‌ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదు : KRMB GRMB బోర్డులు

జీఆర్ఎమ్బీ, కేఆర్ఎమ్బీ ఉమ్మడి సమావేశంలో గెజిట్‌ నోటిఫికేషన్‌లోని అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని ఏపీ తెలిపింది. అభ్యంతరాలు లేని ప్రాజెక్టు వివరాలైతే ఇస్తామని, వివరాల సమర్పణకు వారం గడువు కావాలని బోర్డులను కోరింది. నెలలో గెజిట్‌ అమలు, కార్యాచరణ పూర్తయ్యే అవకాశం లేదని, దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ భద్రతపై కేంద్రంతో చర్చిస్తామని జీఆర్‌ఎంబీ, కేఆర్‌ఎంబీ ఛైర్మన్లు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ, జల్‌శక్తి శాఖలతో చర్చిస్తామని బోర్డులు తెలిపాయి.