గోడ కుర్చీ వేసి విద్యార్థులు- సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్!

ABP Desam Updated at: 02 Aug 2022 02:07 PM (IST)

కోనసీమ జిల్లా పాశర్లపూడి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. గోడ కుర్చీ వేసి మరీ తమ పాఠశాల తమకు కావాలని నినాదాలు చేశారు.

గోడ కుర్చీ వేసి విద్యార్థుల నిరసన, బడికి పంపమంటున్నతల్లిదండ్రులు, ఎందుకంటే?

NEXT PREV

కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలంలోని పాశర్లపూడి గ్రామ ప్రైమరీ పాఠశాల విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. తమ బడిని హైస్కూల్‌లో విలీనం చేయడంపై మండిపడుతున్నారు. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రుల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ స్కూలూ వద్దు మా స్కూలే మాకు ముద్దంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. గంటల పాటు గోడ కుర్చీ వేశారు. చాలా ఇబ్బందులు పడుతూనే నిరసన తెలియజేశారు. విద్యార్థుల ఆందోళన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు  సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రైమరీ పాఠశాలను హై స్కూల్‌లో విలీనం చేయడంపై వారు కూడా ఆందోళన చేశారు. 


హైస్కూల్‌కి వెళ్లాలంటే ఎన్.హెచ్ 216 రోడ్డు మీదుగా వెళ్లాల్సి ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను ఆ దారి వెంట పంపడం కంటే ఇంట్లోనే ఉంచుకోవడం మేలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పిల్లలను హై స్కూల్‌కు పంపబోమని చెప్పారు. కావాలంటే అప్పోసప్పో చేసైనా సరే ప్రైవేటు పాఠశాలకే పంపిస్తామని తెలిపారు. పిల్లల బాగోగుల గురించి ఏం ఆలోచించకుండా ప్రైమరీ పాఠశాలను హై స్కూల్ లో ఎలా కలుపుతారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అసహనం వ్యక్తం చేశారు. 


ప్రైవేటు బడికైనా పంపుతాం..


-


"మా అబ్బాయి మూడో తరగతి చదువుతున్నాడు. వాడికి ఎనిమిదేళ్లు. ఇప్పటికే మా అబ్బాయి మూడు కిలో మీటర్ల దూరం నడిచి వస్తున్నాడు. హై స్కూల్ ఇంకా చాలా దూరం. అంత దూరం పిల్లాడ్ని పంపిచలేం. రోడ్డుపై మాకు నడవాలంటేనే భయం. అలాంటిది చిన్న పిల్లాడిని ఎలా పంపిస్తాం. పిల్లలకు ఏమైనా అయితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా. ప్రైమరీ స్కూల్ ను హై స్కూల్ లో విలీనం చేస్తే.. మేం పిల్లాడిని బడికి పంపించం."- రామలక్ష్మి, విద్యార్థి తల్లి



"ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ కిలో మీటర్ దూరం. నిత్యం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డుపై పిల్లల్ని బడికి పంపించేందుకు తల్లిండ్రులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడే ప్రైమరీ పాఠశాలను కొనసాగిస్తే బాగుంటుంది."- రామలక్ష్మి, విద్యార్థి తల్లి
-

"ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ కిలో మీటర్ దూరం. నిత్యం ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డుపై పిల్లల్ని బడికి పంపించేందుకు తల్లిండ్రులు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఆలోచించి ఇక్కడే ప్రైమరీ పాఠశాలను కొనసాగిస్తే బాగుంటుంది."- రాంబాబు పాఠశాల ఛైర్మన్


ఏ బడీ వద్దు.. మా బడే ముద్దు అంటున్న పిల్లలు..


తల్లిదండ్రుల మాటలు విన్న విద్యార్థనీ, విద్యార్థులు తమకు ఏ బడీ వద్దని చెప్పారు. రోడ్డుపై నడుస్తూ హై స్కూల్ కు వెళ్లలేమని అలాగే ప్రైవేటు పాఠశాలలో చదవడం కూడా తమకు ఇష్టం లేదని చెబున్నారు. అక్కడే తమ బడిని కొనసాగించాలని కోరతున్నారు. 

Published at: 02 Aug 2022 02:07 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.