Kodali Nani On Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మాజీమంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమలాపురంలో పిల్లలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. పిల్లలను రెచ్చగొట్టి శాంతిభద్రతలను కాపాడలేదని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అమలాపురంలో ఫైరింగ్ చేసుంటే పరిస్థితి అదుపులోకి వచ్చేదని, పిల్లల ప్రాణాలు పోతాయని ఫైరింగ్ చేయలేదన్నారు. ఫైరింగ్ చేసి ప్రాణాలు పోతే శవాల వద్ద రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు రెడీగా ఉన్నాయన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లు చదువుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని కొడాని నాని ఘాటుగా వ్యాఖ్యానించారు.
- పవన్ కల్యాణ్ కు అది కూడా తెలియదు
కృష్ణా జిల్లా గుడివాడలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలన్నారు. అలాంటి వాళ్లను జైల్ లో పెట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ప్రాధాన్యమన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లు ప్రభుత్వానికి ముఖ్యంకాదన్నారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగంలోని ఓ విధానమన్నారు. అది కూడా తెలియకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ ప్రకారం గడువు ఇచ్చిందన్నారు.
- శవరాజకీయాలు చేసేవాళ్లు