Breaking News Telugu Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 15 Jul 2022 06:17 PM
బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత 

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.  350 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థులను చికిత్స కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు.  

ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం... వాహనాల అద్దాలు ధ్వంసం

ఎన్నికల్లో హామీ ఇచ్చినా బ్రిడ్జి కట్ట లేదంటూ గ్రామస్తుల నిరసన... వాహనాల అద్దాలు ధ్వంసం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ని అడ్డుకున్నారు గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు వచ్చిన ఎంపీ కి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఎంపీ గా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ మరియు గ్రామంలో ఉన్న మల్లన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానన్న హామీ ఏమైందని  గ్రామస్థులు నిలదీసారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగలగొటారు.

AP Telangana Rain Updates: భారీ వర్షాలకు నిండు కుండలా మారిన వశిష్ఠ గోదావరి

పశ్చిమగోదావరి: ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండను తలపిస్తున్న వశిష్ఠ  గోదావరి 
పశ్చిమగోదావరి జిల్లా  పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ట వారధి వద్ద గోదావరి ఉధృతి ప్రవాహం 
తూర్పు పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే వశిష్ట వారిది మరింత పెరిగితే.. వరద నీరు పాత బ్రిడ్జ్ ను తాకే అవకాశం  
రోజురోజుకు పెరుగుతున్న వరద ఉధృతి..  
జలదిగ్బంధంలో అయోధ్య లంక, పుచ్చల లంక, పెద్దమల్లం లంక, అనగార లంక , మర్రిమూల లంక గ్రామాలు  
లంకల్లో చిక్కుకున్న సుమారు 500 గేదెలను..  ఒడ్డుకు చేర్చిన రైతులు  
జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు..

Somu Veerraju Comments: ఏపీలో సంక్షేమ పథకాలకు నిధులు కేంద్రమే ఇస్తోంది: సోమువీర్రాజు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పీసీ పాయింట్స్


ఏపీలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు వచ్చిన నిధులన్నీ కేంద్రం నుంచి వస్తున్నవే.. దీనిపై బహిరంగ చర్చ కైనా సిద్ధం .


అద్దం లాంటి రోడ్డులను వేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కి చేత కాదు.


పోలవరం ప్రాజెక్టులో కమీషన్ కోసం కకృతి పడి రెండు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లను మార్చాయి.


పోలవరం మేము కడతామని కేంద్రం నుంచి అప్పు తీసుకొచ్చి ఏమి చేశారు..?


ఏపీలోని రెండు ప్రభుత్వాలకి పోలవరం కట్టడానికి చేతకాలేదు.


అనంతపురం జిల్లా నుంచి జనజాగృతి యాత్ర ప్రారంబిస్తున్నాం.


అమలాపురం నియోజకవర్గంలో క్రాప్ హాలిడే ప్రకటించడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం.


సరయిన గిట్టుబాటు ధర, ధరల నియంత్రణ లేకపోవడంతోనే రైతుల అవస్థలు పడుతున్నారు.


నిరుద్యోగులకు చేసిన అన్యాయంపై యువ సంఘర్ష యాత్ర ఆగస్టు 02 నుంచి 14 వరకు యాత్ర చేస్తాం.


అనంతపురం జిల్లాలో నాలుగు నేషనల్ హైవేల నిర్మాణం చెపట్టాం.


ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద 1.80 వేల రూపాయలు ఇస్తున్నాం. ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఏపీకి కేంద్రం ఇచ్చింది.


Nrgs నిధుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తే వాటిని పంచాయతీలకు ఇవ్వలేదు.


కడపలో ఇండస్ట్రీలైజేషన్ కోసం కస్థాపడుతున్నాం.


సబ్సిడీ  బియ్యం కోసం నెలనెలా వెయ్యి కోట్ల రూపాయలు కేంద్రం రాష్ట్రానికి ఇస్తోంది.

Telangana Rain Updates: భద్రాచలానికి హెలీకాఫ్టర్, అదనపు రక్షణ సామగ్రి తరలించండి: CM KCR

భారీ వానలతో గోదావరి ఉగ్రరూపందాల్చి ప్రవహిస్తున్న ప్రకృతి విపత్తు నేపథ్యంలో, ఇప్పటికే సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరదముంపు ప్రాంతాల్లో అన్ని రకాలుగా సహాయక, రక్షణ చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. సిఎం ఆదేశాలమేరకు, స్థానిక  మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను రక్షించే సహాయక చర్యల్లో భాగస్వాములౌతున్నారు.
ఊహించని వరదలకు జలమయమౌతున్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజా రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆరెఫ్ సిబ్బందిని, రెస్కూ టీం లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సిఎం కెసిఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ మేరకు అప్రమత్తంగా వుంటూ  వరదల్లో చిక్కుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగా కాపాడుతున్నది.
భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. దాంతో పాటు వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించారని, అదనంగా మరిన్నింటిని తరలించాలని సిఎం ఆదేశించారు.

తిరుమలలో విషాదం

  • శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా క్యూలైన్ లో స్పృహ తప్పి పడిపోయిన భక్తుడు 

  • చెన్నైకి చెందిన వేదాచలం (64) భక్తుడు మృతి

  • రద్దీ ఎక్కువ ఉండడంతో క్యూలైన్ నుండి వెలుపలకు వచ్చేందుకు తీవ్ర అవస్థలు పడిన మృతుడి కుటుంబ

  • అంబులెన్స్ ద్వారా తిరుమల అశ్విని హాస్పిటల్ కు తరలించారు.

  • అశ్విని హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు.

Journalist Deadbody Found: వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ మృతదేహం లభ్యం

రాయికల్ మండలం లోని రామోజీ పేట వాగు వద్ద మూడు రోజుల క్రితం ఓ ప్రముఖ ఛానల్ లో జగిత్యాల జర్నలిస్టుగా పని చేస్తున్న జమీర్ తన కారుతో సహా గల్లంతయ్యాడు .భారీ వర్షాల కారణంగా సహాయ చర్యలకు ఇబ్బంది ఎదురైంది. అయితే  ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కేృన్ తో మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు గాలింపు జరిపినప్పటికీ వరద ఉధృతి కారణంగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు.  ఈరోజు ఉదయం తిరిగి గాలింపులు జరపగా జమీర్ కి  చెందిన షిఫ్ట్ కార్ వరద నీటిలో మునిగిపోయి కనిపించింద వెంటనే దానిని బయటకు తీసిన అందులో జమీర్ కి సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు .చివరకు గజ ఈతగాళ్లు సాయంతో మరింత దూరం వరకు గాలించగా పొదలలో చిక్కుకున్న మృతదేహం లభించింది ...

Water Level At Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు

Water Level At Bhadrachalam: తెలంగాణతో పాటు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు చేరుకుంది. దీంతో బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాక లోని నేషనల్ హైవే 30 పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి  కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. 

Background

నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.  దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారింది. అనుబంధ ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి జైసల్మీర్, కోటా, గుణ, సాగర్, జబల్ పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంతం ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. తూర్పు పడమర గాలుల కోత ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య విస్తరించి ఉంది.


తెలంగాణలో వారం రోజుల నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నేడు సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుసినా ఏడుకొండలకు భక్తులు‌ పోటెత్తుతున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్య‌ధామం తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో‌ మారుమోగుతుంది. నిన్న ఒక్క రోజులో 74,304 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 31,880 మంది తలనీలాలు సమర్పించగా, 5.45 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండడంతో బయట క్యూలైన్స్ లో భక్తుకు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 20 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది.. 


తెలంగాణతో పాటు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు చేరుకుంది. దీంతో బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాక లోని నేషనల్ హైవే 30 పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి  కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది. 


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.