Duvvada and Divvela are making inappropriate comments on Deputy CM Pawan : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన ప్రియురాలు దివ్వెల  మాధురీ మీడియా చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. వారిదర్నీ టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు వరుసగా ఇంటర్యూలు చేస్తున్నాయి. వారు కూడా ఏ మాత్రం  సిగ్గుపడకుండా వరుసగా ఇంటర్యూలు ఇస్తూ వ్యక్తిగత విషయాల్ని అవసరమైనప్పుడు మాత్రమే సిగ్గుపడుతూ అన్నీ వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో  వారు  చేస్తున్న  కొన్ని  ప్రకటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఇద్దరి మధ్య వయసు గ్యాప్ పై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న సమయంలో పిల్లల ప్రస్తావన వచ్చింది. తమకు  పుట్టబోయే బిడ్డకు దువ్వాడ జగన్ అనిపేరు పెట్టుకుంటామని ప్రకటించారు. 


వైసీపీ అధినేత జగన్ అంటే ఇష్టం కాబట్టి తమకు పుట్టబోయే బిడ్డకు ఆయన పేరు పెట్టుకుంటామని వారు చెప్పారు. కానీ వారి వ్యవహారమే తేడాగా ఉండంతో వారు  చెప్పిన మాట తేడాగా వెళ్లింది. వారు చెప్పిన మాటను ఉదహరిస్తూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జగన్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. అదే సమయలో కాలర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే సమయంలో అసహనానికి గురవుతున్నారు  ఆంధ్రప్రదేశ్ ఉపమఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ఓ సారి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను  గర్భవతిని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. వారు కూడా ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. 


రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు


దువ్వాడ శ్రీనివాస్ ఐదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీ హయాంలో ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ శ్రీకాకుళం జిల్లా మొత్తం పెత్తనం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ క్రమంలో దివ్వెల మాధురీనే ఎక్కువ పనులు చక్కబెట్టేవారని చెబుతారు. ఆమెతో సహజీవనం ప్రారంభించడంతో ఇంట్లో గొడవలు అయ్యాయి. చివరికి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరింత ఎక్కువ అయ్యాయి. ఇటీవల రోడ్డున పడ్డారు. చివరికి ఇప్పుడు ఎవరేం చేసుకుంటో చేసుకోండని ఇద్దరూ ఇలా టీవీ ఇంటర్యూలు కూడా ఇస్తున్నారు. అడల్టరీ నేరం కాదని వారిద్దరూ అంటున్నారు. 



Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?