YS Jagan Bail Live Updates: ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. వచ్చే నెల 15కి తీర్పు వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్పై ఇవాళ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఆయన బెయిల్ను కోర్టు రద్దు చేస్తుందా? లేక కొనసాగిస్తుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.
ABP Desam Last Updated: 25 Aug 2021 01:55 PM
Background
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? కొనసాగుతుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై నేడు (ఆగస్టు 25) కోర్టు తీర్పు ఇవ్వనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు కొద్ది వారాల క్రితమే...More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా? కొనసాగుతుందా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై నేడు (ఆగస్టు 25) కోర్టు తీర్పు ఇవ్వనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు కొద్ది వారాల క్రితమే ఈ పిటిషన్ను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను వేగంగా విచారణ జరపాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ రద్దు పిటిషన్పై జులై ఆఖరులో వాదనలను ధర్మాసనం పూర్తి చేసింది. తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. ఈ క్రమంలో నేడు తీర్పు వెలువడనున్నందున సర్వత్రా ఆసక్తి నెలకొంది.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు పిటిషన్ తీర్పు వచ్చే నెల 15కి వాయిదా
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పు వాయిదా పడింది. సెప్టెంబర్ 15కి తీర్పు వాయిదా వేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్ షరతులను ఆయన ఉల్లంఘించారంటూ వైఎస్సార్ సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 4న సీబీఐ కోర్టులో రఘురామ ఈ పిటిషన్ దాఖలు చేయగా తాజాగా మరోసారి కోర్టులో విచారణ జరిగింది.