AP Corona Cases: వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల.. కరోనా కేసుల వివరాలివే..
ఈ రోజు ప్రధాన వార్తలు

Background
ఏపీకి చేరుకున్న 5.76 లక్షల కోవిషీల్డ్ డోసులుఏపీకి మరో 5.76 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్లు వచ్చాయి. వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరంలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్...More
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ చేస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఇండియా ఎండీగా ఉన్న మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ అయ్యారు. మనీష్ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్గా ట్విటర్ నియమించనున్నట్లు సమాచారం. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా భారతీయుడినే.. నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు కాస్త ఆలోచించింది. భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది.