Breaking News Live Updates: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 26 Oct 2021 09:21 PM

Background

దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనం పై ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మృతులను హౌరీ లాల్, రీనా, అషు, రాధికగా గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు.. హుటాహుటిన తరలి...More

బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తమిళనాడులోని కళ్లకురిచిలోని శంకరాపురం బాణసంచా కేంద్రంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, మరో 10 మంది వరకు కార్మికులు మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.