ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, అసెంబ్లీ సమావేశాలు, సీపీఎస్ పై చర్చ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 07 Sep 2022 11:47 AM

Background

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ...More

రాహుల్ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి: పొంగులేటి సుధాకర్

తిరుపతి : ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజెన్సీ గుర్తించిందని బీజేపీ తమిళనాడు ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ అన్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆయన పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కన్నా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలని, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అమెరికా కన్నా చాలా బాగుందన్నారు. ప్రపంచ అగ్ర నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా డేటా ఏజన్సీ గుర్తించిందని, కేంద్రం సహకారంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేసి అభివృద్ధి సాధించాలన్నారు. విభజన సమస్యలు ఉంటే సామరస్యంగా తీర్చుకోవాలని, తమిళనాడులో బిజేపీకి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు..